బాముని పహార్ లేదా బాముని కొండలు తేజ్ పూర్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటాయి. ఈ ప్రదేశం క్రీశ. 9 వ 10 వ శతాబ్దానికి చెందిన శిల్ప శిధిలాలకు ప్రసిద్ది చెందింది. ఈ శిల్ప శిధిలాలు కొండ మొత్తమ్మీద కనిపిస్తాయి. ఈ శిల్పాలను దగ్గరగా పరిశీలిస్తే గుప్తకాలం నాటి పోలికలు కనిపిస్తాయి. బాముని పహార్ ని ఉష పహార్ (రాణి ఉష పెరుపెట్టబడింది) అని కూడా పిలుస్తారు.
బాముని కొండలపై షుమారు క్రీశ. 4 వ శతాబ్దానికి చెందినా డా పర్వతీయ అనేది అత్యంత ప్రసిద్ధ శిధిల శిల్పం. ఇక్కడ కొండ చుట్టూ రాళ్ళతో చెక్కబడిన కొన్ని శిధిలమైన గోడలు ఉన్నాయి. ఈ రాతి చేక్కుల్లు వారి సృజనాత్మక పొందికకు పేరుగాంచాయి. ఈ గోడలలోని ఒకదానిపై విష్ణుమూర్తి 10 అవతారాల చిత్రాలు, కీర్తిముఖ పానేళ్ళతో అలంకరించబడిన క్రాస్ రూపంలోని బ్రాకెట్ అడ్డదూలం ఇక్కడ కనబడిన ఆశక్తికరమైన చేక్కుళ్ళు.