డా పర్వతీయ శివునికి అంకితం చేసిన 6 వ శతాబ్దం నాటి హిందూ ఆలయం. దాని వారసత్వాన్ని స్వంత హక్కుగా పరిగణిస్తూ ఈ ప్రదేశాన్ని భారతదేశ పురావస్తు శాఖవారు రక్షిస్తున్నారు. అస్సాం పురాతన శిల్ప నమూనాలలో ఒకటిగా ఉన్న ఈ ప్రదేశం రాష్ట్రంలో అత్యంత గుర్తింపు పొందింది. ఈ ఆలయ అసలు నిర్మాణం మొత్తం 1897 లో అస్సాం ని తాకిన భూకంపంలో నాశనమయింది.
గుప్తకాల సారూప్యంలో ఉన్న అనేక గోడల చేక్కుళ్ళు ఈ డా పర్వతీయ ఆలయంలో చూడవచ్చు. ఈ ఆలయ ప్రవేశ ద్వారంలో గంగా, యమునా బొమ్మలు ఉన్నాయి. ఇవి మరింత సున్నితమైన ఆకులతో అలంకరించబడి, చేతిలో దండలు పట్టుకుని కనిపిస్తాయి. రాతి కుహరానికి ముందు ఉన్న తలుపు ఫ్రేం శివలింగం ఉంచడానికి ఉపయోగించారు.
డా పర్వతీయ ఆలయ సందర్శన పర్యాటకులకు ఆ కాలపు నిగూఢమైన కళల దృశ్యాలను అందిస్తుంది.