రుద్రపద ఆలయం బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది. శివునికి అంకితం చేసిన ఈ ఆలయ ప్రాంగణంలో శివుని పాదముద్రలు ఉన్నట్లు నమ్ముతారు. ఈ ఆలయంలో శివుడు ‘రుద్ర’ రూపంలో పూజి౦చ బడతాడు. ‘రుద్ర’ అనేది శివుని భయంకర రూపం అని, ‘పాద’ అంటే పాదముద్రలు అని – అందువల్ల దేన్నికి రుద్రపద అని పేరు.
ఈ ప్రదేశంలో శివుడు రాక్షస రాజైన బాణాసురునికి నిజరూపంలో దర్శన మిచ్చాడని పురాణాల గాధల ప్రకారం నమ్ముతారు. అయితే, పురావస్తు ఆధారాల ప్రకారం, ఈ ఆలయాన్ని శివ సింగ్ షుమారు 1730 లో నిర్మించారు. పాదముద్రలు ఒక రాతిపలకపై ముద్రించబడి, ఈ ఆలయంలో పొందుపరచ బడ్డాయి.
రుద్రపద ఆలయంలో నిర్వహించబడే ప్రధానమైన పండుగలలో మహా శివరాత్రి ఒకటి. ఇది బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంటడం వల్ల ఈ చిన్న ఆలయ౦ నుండి దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. తేజ్ పూర్ లోని ఈ శక్తివంతమైన నది నుండి అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు.