ఒడాతిల్ పల్లి (ఒడాతిల్ మసీదు అని కూడా అంటారు) తలసేరీ మధ్యలో ఉన్న 200 సంవత్సరాల కిందటి ప్రార్ధనా కేంద్రం. ఈ మసీదు ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మాత్రమే కాకుండా, మలబార్ నుండి వచ్చే అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది. పద్దెనిమిదవ శతాబ్దానికి ముందు బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వద్ద కాంట్రాక్టర్ గా పనిచేసిన మూసాకాకా అనే వ్యక్తీ ఈ మసీదుని నిర్మించారు.
ఇది సాంప్రదాయ కేరళ శైలిలో నిర్మించడం వల్ల ఈ మసీదు ప్రచర్యం పొందింది. ఇత్తడి రేకుల పైకప్పుతో వుండే బంగారు గోపురాలు ఈ మసీదును మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఈ మసీదు గోపురం కొన్ని మైళ్ళ దూరం వరకు కనపడే అంత ఎత్తు వుంటుంది.
ఇప్పుడు ఓడతిల్ పల్లి వున్న స్థలం ఒకప్పుడు డచ్ వారు పెంచిన చెరుకు తోట. ఈ మసీదు పేరు ‘ఒడం’ అంటే తోట అనే అర్ధం వచ్చే డచ్ పదం, మలయాళం లో ‘మసీదు’ అని అర్ధం వచ్చే ‘పల్లి’ అనే రెండు పదాలతో ఏర్పడింది.