తలసేరి లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ వేల్లెస్లీ బంగళా ప్రశాంత, నిశ్శబ్ద పరిసరాలతో వుండే బ్రిటిష్ హయాం నాటి పెద్ద భవనం. వెల్లింగ్టన్ డ్యూక్ గా పని చేసిన లార్డ్ ఆర్ధర్ వేల్లెస్లీ పేరిట ఈ భవనానికి పేరు పెట్టారు. లార్డ్ వేల్లెస్లీ తలసేరి లో 18వ శతాబ్దంలో క్రికెట్ ను ప్రవేశపెట్టాడు.
ఈ భవంతిని, చుట్టుపక్కల ప్రాంతాలలోను లార్డ్ వేల్లెస్లీ, ఆయన అనుచరులు క్రికెట్ సాధన కోసం ఉపయోగించారని నమ్ముతారు. అలా ఈ బంగాళా భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్రధాన స్థానం ఆక్రమించుకుంది. ఈ రోజు ఈ భవంతి ప్రాంతీయ సబ్ కలెక్టర్ గారి నివాస భవనంగా వాడుతున్నారు.
ఈ బంగాళాకు పట్టణం లోని అన్ని ప్రాంతాల నుంచి తేలిగ్గా చేరుకోవచ్చు. తలసేరి కోటకు దగ్గరగా వున్న ఈ భవంతి జుమా మసీదు, ఇంగ్లిష్ చర్చి లాంటి ఇతర ఆకర్షణలకు కూడా సమీపానే వుంది. దీని నిర్మాణ౦లో పెనవేసుకుపోయిన చరిత్రతో ఈ భవంతి అన్ని సీజన్లలోనూ యాత్రికులను ఆకర్షిస్తుంది.