జవహర్ లో వున్న జయ విలాస్ పేలస్ ముంకే గిరిజన రాజులకు నిలయం. జవహర్ గా కూడా పిలువబడే ఈ కట్టడం యశ్వన్ రావ్ ముకనే అనే గిరిజన రాజు నిర్మించాడు – దీన్నే రాజ్ బారి అని కూడా అంటారు.ప్రత్యెక నిర్మాణ శైలికి, పురాతనత్వానికి ఈ పేలస్ ప్రసిద్ది పొందింది. ఈ పేలస్ ఒక పేద్ద కొండ పై వుండి అన్ని వైపులా దట్టమైన పచ్చటి అడవులతో కప్పబడి వుంది. ఇక్కడి నుంచి పరిసరాల దృశ్యం చాలా అచ్చెరువొందేలా వుంటుంది.దాదాపు 80 గదులు వున్న ఈ పేలస్ ఆనాటి గృహోపకరణాలు ఎలా ఉండేవో చూపిస్తుంది. కూరి నింపిన పులి బొమ్మల శ్రేణి, పేద్ద హాల్ కూడా ఇక్కడ చూడవచ్చు.ఈ పేలస్ లో జీడి తోటలు చాలా వున్నాయి. థానే నుంచి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో వున్న జయ విలాస్ పేలస్ ప్రధాన ఆకర్షణ.