కాశిమీరా అనేది థానే జిల్లాలో పర్వత ప్రాంతాలు, అసంఖ్యాకమైన సరస్సుల మధ్య నెలకొన్న రెండు అందమైన గ్రామాలలో భాగం.ప్రధాన జిల్లా నుంచి కాశీమీర ను కలిపే వంకర టింకర రోడ్ల ద్వారా ఈ ప్రసిద్ధ ప్రదేశానికి చేరుకోవచ్చు. ఈ రోడ్ల నుంచి ఇక్కడి ప్రశాంతమైన సరస్సులు, ఎత్తైన కొండలు చాలా అందమైన దృశ్యాలు చూడవచ్చు.భారత దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ముంబై ని కలిపే టోల్ నాకా వున్న దహిసార్ అనే చిన్న కేంద్రం నుంచి కాశిమీరా చేరుకోవచ్చు. ఒకప్పుడు సెయింట్ జిరోమ్ చర్చి ఈ రెండు గ్రామాల మధ్యనా వుండి వాటిని విభజించేది. 1595లో నిర్మించిన 400ఏళ్ళ నాటి ఈ చర్చి అప్పటినుంచి మూడు సార్లు ఆధునీకరించబడింది.కాశీ, మీరా అనే ఈ రెండు గ్రామాల్లో ప్రతి ఏటా డిసెంబర్ 25, 26 తేదిల్లో పేద్ద సంత జరుగుతుంది.