భోరప్ ఘడ్ కోట లేదా భోరాయి ఘడ్ కోట గా పిలువబడే సుధా ఘడ్ కోట థానే జిల్లాలోని ప్రధాన చారిత్రిక ప్రదేశం. రెండో శతాబ్దంలో నిర్మించిన ఈ కోటను 1436 లో బహమనీ సుల్తాన్లు ఆక్రమించుకున్నారు. 1650 లో ఈ కోటను మరాఠాలు, భోర్ కి చెందిన పంత్ సచివులు చేజిక్కించుకున్నారు. అనతి కాలంలోనే దీన్ని 1818 లో బ్రిటిష్ వారు కలుపుకున్నారు.ఇక్కడ భోరాయిదేవి గుడి వుండడం వల్ల సుధా ఘడ్ కోటను భోరాయి ఘడ్ కోట అని కూడా పిలుస్తున్నారు.ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రసిద్ధ పర్వతారోహణ కేంద్రంగా వున్న ఈ కోట లో పేద్ద ధాన్యాగారం, కొన్ని సమాధులు, రెండు అందమైన సరస్సులు, ఒక ఇల్లు, ఒక దేవాలయం తో పాటు కొన్ని శిధిలాలు వున్నాయి. ఈ కోటకు మూడు ముఖ ద్వారాలు వున్నాయి – వాటిలో మహా దర్వాజా అన్నిటికన్నా పెద్దది.