తమిళనాడు రాష్టంలోని తింగలూర్ గ్రామంలో ఉన్న కైలాసనాద్ ఆలయం హిందువులచే పూజించబడే ధార్మిక స్థలం. కైలాసనాద్ గా పూజించబడే శివుడు ఈ ఆలయ ప్రధాన దేవత. ఈ ఆలయ ప్రాంగణంలో చంద్రుడి విగ్రహం కూడా ఉంది. ఆసక్తికరమైనది, తమిళ భాషలో చంద్రుడిని ‘తింగళ్’ అంటారు. బహుశా, ఈ స్థలం దాని పేరుపై చెప్తారు. ఈ ఆలయం చుట్టూ నడుస్తున్న రెండు పర్కర్మలతో, 5 అంచెల రాజగోపురంతో దీని నిర్మాణం విలక్షణమైన తమిళనాడు శైలిలో ఉంది. ఈ ఆలయం అప్పార్ పాడిన పాటలతో పాటు, తమిళనాడు సాహిత్యం అనేక భాగాలలో ఖ్యాతి గడించింది. అయితే, అప్పార్ తన పద్యాలలో దేవుడిని గురించి పేర్కొనలేదు, అందువల్ల పాదాల్ పేత్రా స్థలం వర్గీకరించబడ లేదు.
ఈ ఆలయాన్ని హిందూ యాత్రీకులు తప్పక సందర్సించాలి, ప్రతి ఏటా వేలమంది భక్తులు శివుడిని ప్రార్ధించడానికి ఈ ఆలయానికి వస్తారు, ప్రజలు వారి జ్యోతిశాస్త్ర జన్మ పట్టికలో చంద్రుడి ప్రభావం వల్ల ఏర్పడే దుష్ప్రభావాలను పోగొట్టుకోవడానికి చంద్రుడి ఆశీర్వాదం కోసం వస్తారు.