కట్టబోమ్మన్ మెమోరియల్ ఫోర్ట్ ను మొదట్లో పంచాలంకురిచి కోట అనేవారు. సాలికులం లో ఇది ప్రసిద్ధ ఆకర్షణ. ఈ కోటను పంచాలంకురిచి రాజు వీర పాండ్య కట్టబోమ్మన్ 18 వ శతాబ్దం లో నిర్మించాడు. 1799 లో బ్రిటిష్ వారు ఒక యుద్ధం లో ఈ కోటను ధ్వంసం చేసి కట్టబోమ్మన్ ను బందీ చేసారు. తర్వాత మరల బ్రిటిష్ వారి నుండి అతని సోదరుడు స్వాధీనం చేసుకుంటాడు.
స్వాతంత్రం తర్వాత ఈ కోటను అర్కేయోలజికల్ సర్వే అఫ్ ఇండియా నిర్వహిస్తోంది. 1974 లో తమిళ్ నాడు ప్రభుత్వం ఒక కొత్త కోటను కట్టి దానికి కట్టబోమ్మన్ మెమోరియల్ ఫోర్ట్ అని పేరు పెట్టింది. ఈ కోట లో కట్టబోమ్మన్ కుల దేవత అయిన, జక్కమ్మ గుడి వుంటుంది. చరిత్ర ప్రియులు ఈ ప్రదేశాన్ని తప్పక చూడాలి.