తిరునగేశ్వరం, తమిళనాడు లోని తంజావూర్లో ఉన్న ఒక పంచాయతి పట్టణం. ఇది కుంబకోణం నగరానికి తూర్పు వైపుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని రాహుదేవునికి (రాహువు గ్రహం) అంకితమిచ్చారు. తిరునగేశ్వరం సారవంతమైన భూమికి కూడా పేరొందింది, ఇక్కడ పండించే పంటలలో గోధుమలు, వరి, మొక్కజొన్న ప్రధానమైనవి. ఇక్కడ విస్తారమైన మామిడి, కొబ్బరి తోటలను కూడా మనం గమనించవచ్చు.
తిరునగేశ్వరం లోనూ, చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలు ఈ పట్టణంలో రెండు ప్రధాన ఆలయాలు ఉన్నాయి- ఒకటి శైవుల ప్రముఖ ఆలయం “నాగనాథ స్వామి” కాగా, రెండవది వైష్ణవుల ప్రసిద్ధ “ఒప్పిలియప్పన్ ఆలయం”. నాగనాథ స్వామి ఆలయంలో ప్రధాన దేవత శివుడు తన సహచరి పార్వతి దేవితో దర్శనమిస్తాడు. రాహువు విగ్రహం ఈ ఆలయంలో మానవ రూపంలో దర్శనమిస్తుంది. ఎవరి జన్మపట్టికలోనైన రాహు గ్రహం దుష్ప్రభావాలు వారి జీవితంలో ఇబ్బందులను కల్గ చేస్తాయని అంటారు. అందువల్ల, నాగనాథ స్వామి ఆలయంలో రాహువును పూజిస్తే ఇటువంటి దురదృష్టాల నుండి బయట పడవచ్చు. ఈ ఆలయంలోని ప్రధాన అంశం రాహువుకు చేసే క్షీరాభిషేకం.
ఏడాది పొడవునా తీర్థయాత్రికులు సందర్శించే ఒప్పిలియప్పన్ ఆలయం కూడా తిరునగేశ్వరంలో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయంలో, రామనవమిని అద్భుతంగా జరుపుకుంటారు. రామనవమి చివరి రోజు, కనకాభిషేకం, తిరుకల్యాణం గొప్పగా, భారీ ఎత్తున జరుగుతాయి, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ రెండు ఉత్సవాలలో పాల్గొనడానికి వస్తారు. తిరునగేశ్వరం చుట్టుపక్కల ఉన్న నవగ్రహ ఆలయాలు
8 నవగ్రహ స్థలాలు అన్ని తిరునగేశ్వరానికి దగ్గరగా ఉన్నాయి (ఇది తొమ్మిది నవగ్రహ ఆలయాలు లేదా స్థలాలలో ఒకటి). తిరునల్లార్ (శనిగ్రహం), కంజనూర్ ( శుక్రగ్రహం), సూర్యనార్ కోయిల్ (సూర్యుడు), తిరువెంకడు ( బుధుడు), తింగలూర్ (చంద్రుడు), కీజ్పెరు౦పల్లం ( కేతువు), అలంగుడి (గురగ్రహా౦), వైదీశ్వర కోయిల్ (అంగారకుడు) తిరునగేశ్వరానికి దగ్గరగా ఉన్నాయి. సులువుగా చేరేమార్గం తిరునగేశ్వరానికి కుంబకోణం రైలు స్టేషన్ అతి దగ్గరగా ఉంది. ఈ ప్రాంతానికి త్రిచి విమానాశ్రయం బాగా దగ్గర. బస్సు సేవలు కూడా చాలా చక్కగా ఉండటం వల్ల పర్యాటకులు కుంబకోణం నుండి తిరునగేశ్వరం బస్సుల ద్వారా చేరవచ్చు.