దేశం యావత్తూ ఉన్న సిరియన్ క్రైస్తవులకు ఆరాధ్య ప్రార్థన మందిరం అయినటువంటి పలియక్కర చర్చి శ్రీ వల్లభాలయం కి అతిసమీపంలో ఉంది. క్రీ.శ 54 వ సంవత్సరంలో ఇక్కడికి సెయింట్ థామస్ విచ్చేసారు. అద్వితీయమైన దీని నిర్మాణ శైలి, అచ్చెరువొందించే ఇచ్చటి శిల్పకళా విన్యాసం , ముఖ్యంగా దైవపీఠం యొక్క తూర్పు గోడ పైని కుడ్యచిత్రాలు వర్ణించ వీలు కాదు. ఈ చర్చి లోని చెక్కిన తడిక కిటికీ ల తో నిండిన గోడల మధ్య మత ప్రచారానికి , సాంఘిక ఉద్యమాలకి సంబంధించిన ఎన్నో పోరాట గాథలు దాగి ఉన్నాయి.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడి పండుగలు శ్రీ వల్లభాలయం పండుగలని చాలా వరకు పోలి ఉంటాయి. హిందూ క్రైస్తవ మత సంస్కృతుల మేలు సంగమం ఇక్కడ ద్యోతకమవుతుంది. ఉదాహరణకి, చర్చి లో ఏప్రిల్-మే నెలల లో జరిగే పది రోజుల పండుగ గుడి లో జరిగే ఉత్సవానికి చాలా దగ్గరగా ఉంటుంది.