తిరువన్నమలై శివారు ప్రాంతం లో పురాతన మందిరం ఈ పచైఅయమ్మన్ కొయిల్. ఈ మందిరం కనీసం 1000 సంవత్సరాలకు పూర్వందని నమ్ముతారు. అయినప్పటికీ, ఇప్పుడు కనిపించే కట్టడం 120 ఏళ్ళ క్రితం నిర్మితమైనది. శివుడి భార్య అయిన పార్వతి దేవి ని పచైఅయమ్మన్ రూపం లో ఈ మందిరం లో పూజిస్తారు. ఈ దేవతని ప్రపంచ శాంతి కి ఐఖ్యత కి రూపం గా నమ్ముతారు.
తిరువన్నమలై లో ప్లేగు వ్యాధి ప్రబలిన 1905 లో శ్రీ రమణ మహర్షి ఇక్కడ ఆరు నెలలు ఆశ్రయం పొందారని అంటారు. విరుపాక్ష గుహ నుండి ఈ మందిరానికి వచ్చి వ్యాధి నుండి తప్పించుకున్నారు. ఈ గుడిలో ప్రదక్షిణ, ఋషులు నడిచిన పవిత్ర మార్గం లో జరుగుతుంది. ఈ మందిరం అంతర్గత మార్గం లో ఉండడం వల్ల బాహ్య మార్గం తో సంబంధం ఉండదు. గుహకి తిరిగి వెళ్ళాక ఈ మహర్షి తరచుగా మందిరాన్ని సందర్శించేవారు.