పదవేడు పట్టణం లో ఉన్న ఈ దేవాలయం తిరువన్నమలై కి 7 కిలో మీటర్ల దూరం లో ఉంది. హిందువులకు ముఖ్యమైన ఈ దేవాలయం శక్తీ స్థలాల్లో ఒకటి. ఇక్కడ 'సోమనాథలింగం' రూపం లో శివుడ్ని పూజిస్తారు.
విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు తన తండ్రి రిషి జమదగ్ని అజ్జ్న మేరకు తల్లి రేణుకా దేవిని వధిస్తాడు. తల్లిని వధించేతప్పుడు తల్లి తలతో పాటు రజక స్త్రీ తలను కూడా నరికినట్టుగా నమ్ముతారు. తరువాత, తన తండ్రి ఆజ్ఞ పాటించినందుకు ఏదైనా వరం కోరుకోమని అడగగా తన తల్లిని బ్రతికించమని కోరుకుంటాడు. అప్పుడు, ఆ రిషి వరాన్ని ఇస్తూ తన తల్లి శిరస్సును మొండాన్ని కలపమని చెప్తాడు. ఈ ప్రయత్నం లో తల్లి శిరస్సు రజక స్త్రీ యొక్క శరీరానికి అలాగే రజక స్త్రీ యొక్క తలను తన తల్లి శరీరానికి కలిపాడు. ఇక్కడ పదవేడు దేవాలయం లో రేనుకంబాల్ గా ఈ రేణుకా దేవి తలతో గల రజక స్త్రీ శరీరాన్ని పూజిస్తారు.