మన్నర్గుడి లోని రాజగోపాలస్వామి ఆలయం భక్తులలో దక్షిణ ద్వారక గా ప్రసిద్ది చెందింది. ఈ రాజగోపాలస్వామి గా కృష్ణుడు పూజించబడతాడు. ఈ ఆలయ ప్రాంగణం 23 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఆలయ ప్రాంగణం 24 విగ్రహాలు, 16 పొడవైన గోపురాలు లేదా టవర్ ప్రవేశద్వారాలు, 7 ప్రాంగణాలు, 7 హాళ్ళు, 9 టాంకులు కలిగిఉంది. దీనిని కులోత్తుంగ చోళుడు నిర్మించగా, చోళ వంశంలోని తరువాతి రాజులు దానిని విస్తారంగా పునరుద్ధరించారు. తరువాత నాయక వంశ రాజులు దాన్ని మరింత విస్తరించారు. హర్దిద్రనది గా పిలువబడే ఈ దేవాలయం లోని కొలను 1158 అడుగుల పొడవు, 837 అడుగుల వెడల్పుతో వుండి దేశంలోని అతిపెద్ద కొలనుల్లో ఒకటిగా ప్రసిద్ది చెందింది. మార్చ్, ఏప్రిల్ నెలల్లో పంగుణి అనే తమిళ మాసం జరుగుతున్నప్పుడు ఈ దేవాలయాన్ని సందర్శించడం ఉత్తమం. ఈ మాసంలో 16 రోజుల పాటు పంగుణి తిరువిళ అనే ఉత్సవం నిర్వహిస్తారు.