దక్షిణ తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో నిశబ్దంగా ఉన్న ఒక దివ్య, పవిత్ర భూమి తిరువత్తర్, ఇది ఒక చిన్న పంచాయతి పట్టణం. ఇది హిందువుల 108 దివ్యదేశాలలో ఒకటి అయినందున హిందూ తీర్థయాత్రికులు తప్పనిసరిగా సందర్శించవలసిన పట్టణం.
దీని ధార్మిక ప్రాధాన్యతతో బాటుగా, ఈ పట్టణం అందమైన దృశ్యాలతో కనువిందు చేయడం వలన పర్యాటక గమ్యస్థానంగా పేరుపొందింది. ఈ పట్టణం పొడవు మేరా ప్రవహించే పహ్రాలి, కోథాయి అనే రెండు నదుల నడుమ తిరువత్తర్ ఉంది. నిజానికి, ఈ ప్రాంతానికి దాని పేరు ఈ రెండు నదులు మూవట్టుముగం దగ్గర కలియడం వలన వచ్చింది; ‘తిరు’ అంటే తమిళంలో పవిత్రం అని అర్ధం, ‘వట్ట’ చుట్టూ అనే పదానికి తమిళ అర్ధం, అరు అనేది నదికి తమిళ పదం. ఇలా, తిరువత్తర్ అంటే చుట్టూ నదులు ఉన్న పవిత్ర ప్రాంతం.
తిరువత్తర్ లో ప్రధాన ఆకర్షణ దివ్యమైన పవిత్ర శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం, ఈ ఆలయం ఉండటం వలన ఈ పట్టణానికి దివ్యత్వం వచ్చింది. మథూర్ హ్యంగింగ్ బ్రిడ్జి, సెయింట్ జేమ్స్ చర్చి (వంద ఏళ్ళ నాటిది), ఉదయగిరి కోట, తిరువత్తర్ పట్టణం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిర్పరప్పు జలపాతాలు తిరువత్తర్ పట్టణంలో ఇతర ప్రసిద్ధ, తరుచు పర్యాటకులు సందర్శించే ప్రాంతాలు. ఈ పట్టణం హిందువుల తీర్థయాత్ర కేంద్రమైనందున, దేశంలోని ఇతర ప్రాంతాలకు రోడ్ల ద్వారా చక్కటి అనుసంధానాన్ని కల్గించడానికి ప్రయత్నాలు చేపట్టారు.
కన్యాకుమారిలో అతి దగ్గరి రైలు స్టేషన్ ఉంది, తిరువంతపురంలో అతి దగ్గరి విమానాశ్రయం ఉంది. తీర్థయాత్రికులు, పర్యాటకులు వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండే శీతాకాలంలో ఈ పట్టణాన్ని సందర్శించడానికి ప్రాధాన్యత నిస్తారు. వేసవి చెమట పట్టిస్తూ వేడిగా ఉండగా, వర్షాకాలంలో ఈ ప్రాంతంలో వచ్చే తుఫానుల కారణంగా ప్రయాణించడం కష్టమౌతుంది.