తిరువత్తర్ పట్టణానికి దగ్గరగా ఉన్న మాథుర్ హ్యంగింగ్ బ్రిడ్జ్ లేదా మాథుర్ హ్యంగింగ్ తొట్టె ప్రధానంగా ఒక నీటివనరు లేదా నీటిని సరఫరా చేయడానికి ఉపయోగించిన ఒక పైపు. ఈ బ్రిడ్జిని పహ్రాలి నదిపై నిర్మించారు. ఈ క్రుత్రిమకాలువ దగ్గరగా ఉన్న చిన్న గ్రామం మాథుర్ పేరును దీనికి పెట్టారు.
తిరువత్తర్ నుండి మాథుర్ బ్రిడ్జి 3 కిలోమీటర్ల దూరంలోను, కన్యాకుమారి నుండి 60 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. దక్షిణాసియా మొత్తం మీద ఈ బ్రిడ్జి అతి ఎత్తైన, అతి పొడవైన కృత్రిమ కాలువగా విలక్షణతను పొందింది.కరువు సమస్యలను తీర్చేందుకు ఒక సహాయంగా 1966
లో ప్రారంభించగా ప్రస్తుతం ఇది దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరొందింది. పర్యాటకుల ప్రవాహాన్ని ప్రోత్సాహించడానికి ఈ ప్రాంతంలోని సౌకర్యాలను పెంపొందించేందుకు పర్యాటక శాఖ చర్యలు చేపట్టింది. ఈ కృత్రిమ కాలువ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సంవత్సరం పొడవునా నిర్వహిస్తూ, ఈ స్థలం పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా కనేబడే విధంగా చేస్తున్నారు.