తిరువత్తర్ పట్టణంలో ఉన్న శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం ఒక హిందూ ఆలయం, ఇది 108 దివ్య దేశం లలో ఒకటి, అందువలన అనేక మంది తీర్థయాత్రికులు ఈ ఆలయాన్ని క్రమం తప్పక దర్శిస్తారు. చుట్టూ మూడు ప్రక్కల కోథాయి, పహ్రాలి, తమిరబరని అనే నదులు ప్రవహించే అందమైన ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం శివుడు, ఆదికేశవ పెరుమాళ్ లకు చెందినది.
పురాణ గాధల ప్రకారం, ఆదికేశవ స్వామి కేసి రాక్షసుని ఒక భయంకరమైన యుద్ధంలో చంపాడు. ఈ రాక్షసుని భార్య ఆదికేశవ స్వామిని నాశనం చేయడానికి గంగా, తమిరబరని నదుల సహాయాన్ని కోరింది. అయినప్పటికీ, ఆమె స్వామిని ఓడించలేకపోయింది.
ఈ ఆలయ నిర్మాణ౦ ఒక పెద్ద సభామందిరంతో బాటుగా తలుపులు, బురుజులు, పై కప్పు చెక్కతో నిర్మించబడి కేరళ శైలిని పోలి ఉంటుంది. వివిధ భంగిమలలో ఉన్న హిందూ దేవళ్ళు, దేవతల రూపాలను ఈ చెక్కలో చక్కగా చెక్కారు. హిందూ ఇతిహాసాల నుండి ప్రసిద్ధ దృశ్యాలను కూడా బురుజులు, పై కప్పు పై ఎంతో అందంగా చెక్కారు.