త్రిశూర్ నగరాన్ని రామవర్మ అప్పన్ తంపురన్ నిర్మించారు. అతనికి గుర్తుగా సాంస్కృతిక మ్యుజియం ని రూపొందించారు. రామవర్మ అప్పన్ తంపురన్, శక్తివంతమైన పరిపాలకుడిగా పేరొందడం వల్ల శక్తాన్ తమ్పురం గా కూడా ప్రసిద్ది చెందారు. అయన గౌరవార్ధం, జ్ఞాపకార్ధంగా అప్పన్ తంపురం స్మారకం ని 1976 లో కేంద్ర సాహిత్య అకాడమీ వారు నిర్మించి నిర్వహణా బాధ్యతలు చేపట్టారు.
ఇందులో వివిధ పుస్తకాలు, మాగజైన్స్, పత్రికలూ, జర్నల్స్ వంటివి లభిస్తాయి. రామవర్మ అప్పన్ తంపురన్ యొక్క ఆలోచనలు వ్యాప్తి చేసేందుకు ఈ పత్రికలు దోహదపడతాయి. కొలోనియల్ సమయానికి ముందు, తరువాత మరియు కొలోనియల్ సమయంలో కేరళ యొక్క సాంస్కృతిక మరియు చారిత్రకత గురించి తెలుసుకునేందుకు ఈ మ్యూజియం తోడ్పడుతుంది. ఒక ప్రశాంతమైన మధ్యాహ్నం ఇక్కడ గడపడానికి అనువైనది. త్రిశూర్ కి అయ్యన్తోల్ సమీపంలో నే ఉంది. ఇక్కడికి చేరుకోవడం సులభం.