అత్యంత ప్రాచుర్యం పొందకపోయినా సందర్శించేందుకు చర్పా ఫాల్స్అనువైన ప్రదేశం. తమిళ్ నాడు మరియు కేరళ ని కలిపే రహదారిలో ఈ జలపాతం కనిపిస్తుంది. త్రిశూర్ నుండి 60 కిలో మీటర్ల దూరంలో ఉంది. వర్షాకాలంలో ఈ జలపాతం సందర్శించడం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.
రాష్ట్రం లో ఎడతెరిపి లే ని వర్షాలు కురిసే సమయంలో ఈ జలపాతం లో ని నీళ్ళు రోడ్డు మీదకి కూడా వచ్చే అవకాసం కలదు. 25 కిలో మీటర్ల ఎత్తు మాత్రమే ఉన్న జలపాతం నుండి జాలువారే నీళ్ళు గలగల సవ్వడులు చేస్తూ పర్యాటకులని ఆకర్షిస్తాయి. చలకురి నది పైన ఉన్న ఈ ప్రాంతాన్ని "నయాగరా ఫాల్స్ ఆఫ్ ఇండియా" గా పేర్కొంటారు. దిల్ సే, గురు, ఇరువర్ వంటి ఎన్నో సినిమాలలో ఈ జలపాతాన్ని చిత్రీకరించారు.