కేరళ యొక్క కళలు మరియు సంస్కృతి ల వ్యాప్తి కై తీవ్రంగా కృషి చేస్తున్న కేంద్రం ఈ కేరళ కళామందిరం. లలిత కళలను బోధించే విద్యా సంస్థ ఇది. కళల వ్యాప్తికై కృషి చేస్తున్న రెసిడెన్షియల్ కాంపస్ ఇది. ప్రముఖ కవి పద్మభూషణ్ వల్లతోల్ నారాయణ మీనన్ గారిచే ఈ కళామండలం 1930 లో స్థాపించబడినది.
ఆసక్తికరమైన మరియు ఉత్సాహవంతులకి ఈ కళామండలం ద్వారాలు ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతాయి. అందుకే కేరళ పర్యాటక శాఖతో కలిసిన ఈ ప్రాంతం ఏంతో మంది పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తోంది. పురాతన మరియు ప్రస్తుతం ఆచరణలో ఉన్న కేరళ సంస్కృతులని తెలుసుకునేందుకు ఈ కళామండలం ఒక వేదికగా పనిచేస్తుంది.
వల్లతోల్ మ్యూజియంలో నారాయణ మీనన్ గారి రచనల ప్రదర్శన ప్రముఖంగా ఆకర్షిస్తుంది. అంతే కాకుండా, ఈ కళామండలం యొక్క అభివృద్దికి కృషిచేసిన ఏంతో మంది కళాకారుల పోర్ట్రైట్ గాలెరి (Portrait gallery) ప్రదర్శన కూడా సందర్శకులని అమితంగా ఆకర్షిస్తుంది. పురాతన కళామండలం ప్రాంగణంలో ఉన్న సమాధిలోవల్లోతోల్ వారి ఆత్మ విశ్రాంతి తీసుకుంటోంది.