కేరళ లో ఉన్న అతి ప్రాచీన గుడు ల లో ఈ పరమేకవు భగవతి టెంపుల్ ఒకటి. ఈ ఆలయం దాదాపు వెయ్యేళ్ళ క్రితానికి చెందినది. దుర్గా అమ్మవారి రూపం అయిన భగవతీ అమ్మవారు కొలువున్న ఈ గుడి కేరళ లో నే అతిపెద్ద ఆలయం. ప్రతి ఏడు ఆనందోత్సాహాలతో వాడక్కుమ్నాతాన్ టెంపుల్ లో ఊరేగింపు జరిగే సమయంలో భగవతీ అమ్మవారు మహా శివుడిని కలుసుకునేందుకు వెళ్తారని నమ్మకం.
పూరం పండుగలలో పాల్గొనే రెండు గుడులలో పరమేకవు భగవతీ టెంపుల్ ఒకటి. ఏప్రిల్ మరియు మే మధ్య నెల ల లో జరిగే ఈ పండుగ ఈ నగరం యొక్క సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉంటుంది. ఉదయం 4:30 నుండి 10:30 వరకు మరియు సాయంత్రం 5 నుండి 8:30 వరకు ఈ గుడి తెరచి ఉంచే వేళలు.