త్రిశూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పీచి డ్యాం త్రిశూర్ లో ని చుట్టుపక్కల గ్రామాల కోసం నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్ట్. మానవ నిర్మితమైన అద్భుతంగా మారిన ఈ డ్యాం వరి పొలాల రైతులని ఆదుకుంటూ పరిసర ప్రాంతాలను పచ్చని పొలాలతో అధ్బుతంగా మార్చేసింది. పరిసరాల్లో ఉన్న అందంగా తిర్చిదిద్దబడిన బొటానికల్ గార్డెన్స్, మనోహరమైన ఫౌంటైన్స్, చూపరులను అమితంగా ఆకర్షిస్తాయి. మనాలి నది పై నిర్మించబడిన ఈ డ్యాం ని చూసి ఆస్వాదించవలసిందే.