శక్తాన్ తంపురన్ పాలస్ ని పూర్వం వాడక్కెచిర కోవిలకం గా పిలిచేవారు. త్రిశూర్ వాస్తు శిల్పి అయిన అప్పన్ తంపురం స్మారకం గారికి చెందినది ఈ పాలస్. కొచ్చి రాజ వంశస్థులకి చెందిన ఈ పాలస్ ని 1795 లో శక్తాన్ తంపురన్ గారిచే ప్రస్తుత కేరళ - డచ్ శైలిలో పునర్ణిర్మితమయ్యింది. ఈ పాలస్ ని 2005 లో మ్యూజియంగా పరిగణించారు.
టిప్పు సుల్తాన్ వంటి కొందరు పాలకుల సందర్శనకు సంబంధించిన కొన్ని ఆధారాలు, ఇంకా అప్పటి పరిపాలకులకి సంబంధించిన చారిత్రక వస్తువులు కొన్ని ఈ మ్యూజియంలో గమనించవచ్చు. అంతే కాకుండా, కంచుతో చేసిన కళాఖండాలు, గ్రానైట్ శిల్పాలు, సేకరించబడిన పురాతన నాణాలు, కొచ్చి రాజవంశస్థులకి సంబంధించిన కొన్ని దస్తావేజులు వంటివి కూడా ఇక్కడ గమనించవచ్చు.
పాలస్ ప్రాంగణంలో ఉన్న హెరిటేజ్ గార్డెన్ కొన్ని వైవిధ్యభరితమైన మొక్కలను మరియు చెట్లను సంరక్షించేందుకు ఏర్పాటు చేసారు.