స్టేట్ మ్యూజియం ఆఫ్ త్రిశూర్ 1885 లో ఏర్పాటైంది. 13.5 ఎకరాల వరకు ఈ మ్యూజియం విస్తరించబడినది. విశాలమైన ఆవరణ కలిగిన ఈ మ్యూజియం చక్కటి విశ్రాంతి కి అనువైన ప్రదేశం. ఇందులో, వివిధ కాలాలకి సంబంధించిన చారిత్రక కళాకృతుల ని ప్రదర్శనలో ఉంచారు. లోహపు శిల్పాలు, కథాకళి చిత్రపటాలు, సాంప్రదాయక కేరళ దీపాల యొక్క వరుసలు వంటివి చూడడం ద్వారా కేరళ ని సందర్శించిన విభిన్న అనుభూతిని పర్యాటకులు పొందవచ్చు.
ప్రాచీన సాంప్రదాయక ఆభరణాలు, రాళ్లు వంటి వివిధ చారిత్రక సేకరణలను ఇక్కడ గమనించవచ్చు. కేరళ యొక్క సంస్కృతి ని తెలుసుకునేందుకు ఈ ప్రాంతం అనువైనది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవడం చాలా సులభం.