శ్రీ కృష్ణుడి భక్తులకి ఆధ్యాత్మిక స్వర్గం ఈ తిరువంబడి కృష్ణ టెంపుల్. శతాబ్దాల క్రితం, ఎన్నో పురాణాలు, కథలలో ఈ గుడి అత్యంత ప్రాచుర్యం పొందింది. ఉదయం 5 నుండి 11 గంటల వరకు మళ్లీ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 నిమిషాల వరకు ఈ గుడి తెరిచి ఉంచే వేళలు. స్వరాజ్ రౌండ్ కి దగ్గరగా ఈ గుడి ఉంది.
త్రిశూర్ పూరం పండుగలో రెండు విభాగాలైన త్రిశూర్ కి ప్రతినిధిగా కేరళలో జరిగే ఈ వేడుకలలో ప్రధానంగా పాల్గొనే రెండు గుడులలో తిరువంబడి కృష్ణ టెంపుల్ ఒకటి. ఈ నగరాన్ని 200 ఏళ్ళ క్రితం స్థాపించిన పితామహుడి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. బంగారంతో అలంకరించబడిన ఏనుగులు, కళ్ళు మిరుమిట్లు గొలిపే బాణసంచా ప్రదర్శనల వల్ల ఈ పండుగకి UNESCO వారి ద్వారా భూమిపై జరిగే అత్యంత ఆకర్షనీయమైన పండుగగా గుర్తింపు పొందింది. ఏప్రిల్ నుండి మే మధ్య కాలం లో ఎప్పుడైనా ఈ పండుగ జరగవచ్చు. వేడి మరియు తేమ గా ఉండే వాతావరణాన్ని తట్టుకోగలిగిన వారు ఈ పండుగని చూసి ఆనందించవలసిందే.