త్రిశూర్ కి 50 కిలో మీటర్ల దూరంలో తిరువిల్వమల అనబడే ప్రశాంతమైన గ్రామం ఉంది. కోవెలలు అధికంగా ఉండడం వల్ల ఈ గ్రామం ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. శ్రీకృష్ణుడు, మహాశివుడు కొలువుండే దేవాలయాల సమూహాలు ఇక్కడ గమనించవచ్చు. కేరళ లో శ్రీ రాముడికి సంబంధించిన గుడులు తక్కువే. అయితే, తిరువిల్మల లో శ్రీ రాముడు కొలువున్న విల్వద్రినాథ్ గుడి మనకి అగుపిస్తుంది.
ఎన్నో ప్రాంతాల నుండి భక్తులని ఈ గుడి ఆకర్షిస్తుంది. భాతహప్పుజ్హ నదీ తీరంలో ఉన్న ఈ గుడి ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం తో అమితంగా ఆకట్టుకుంటుంది. త్రిశూర్ పూర్ణం పండుగ లాగ ఈ గుడిలో పరక్కోట్టుకవు తలప్పోలి పండుగని జరుపుకుంటారు. కసవు లేదా బంగారపు అంచు కలిగిన చీరలని ఈ గ్రామంలో అమ్ముతారు. ఈ గ్రామానికి చేరుకోవడానికి బస్సు సౌకర్యాలు కలవు. అద్దె కారులు కూడా లభిస్తాయి.