శ్రీ వరదరాజ పేరుమాళ్ ఆలయాన్ని కొన్ని శతాబ్దాల కిందట శ్రీ వరదరాజ పెరుమాళ్ స్వామికి విధేయుడు, భక్తుడు కృష్ణవర్మ రాజు కట్టించాడు. పురాణాలననుసరించి ప్రక్క రాజ్యానికి చెందిన రాజు ఇతనిపై దండెత్తినప్పుడు ఈ దేవుడు వీరరఘవన్ రూపంలో సహాయానికి వచ్చాడు. ఈ ఆలయాన్ని రాజు ఈ దేవుని గౌరవార్ధం కట్టించాడు. ఈ ఆలయం చుట్టూ ఒక నగరాన్ని కూడా వీరరాఘవపురం పేరుతో రాజు కట్టించాడు. ఈ ఆలయం తమిరబరని నది ఒడ్డున ఉంది. ఈ ఆలయంలో ప్రధాన విరాట్టు లేదా “మూలవార్” వీరరఘవన్ కాగా ఉత్సవమూర్తి శ్రీ వరదరాజ పెరుమాళ్, ఈయన పేరుని ఆలయానికి పెట్టారు. ఈ ఆలయాన్ని ఉత్సవాలు జరిగే సమయంలో సందర్శించడం ఎంతో ఉత్తమం. తమిళ నెల చితరై (ఏప్రిల్ మధ్య నుండి మే మధ్య) లో జరిగే బ్రహ్మ ఉత్సవాల సమయంలో సందర్శించడం బహుమతి అందుకోన్నట్లే ఉంటుంది. ఆలయ సమయాలు ఉదయం 7.00 గంటల నుండి 11.00 వరకు సాయంత్రం 6.00 నుండి 9.00 వరకు.