శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం తిరుపతి నుండి 48 కి.మీ. దూరంలో కార్వేటినగరం లో ఉంది. 14 వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం శ్రీమద్రామానుజాచార్యుల వారు స్తాపించినడిగా భావిస్తారు. ఈ ఆలయంలో వేణుగోపాలస్వామి విగ్రహం ఉంది. ఈ ఆలయంలో శ్రీ సత్యభామ అమ్మవారు, శ్రీ రుక్మిణి అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి.
ఈ ఆలయ ప్రాంగణంలో సీతారాముల పట్టాభిషేకానికి చెందిన ఒక చిన్న గుడి కూడా ఉంది. గోకులాష్టమి, వైకుంఠ ఏకాదశి, తెప్పోత్సవం, బ్రహ్మోత్సవం మొదలైనవి ఈ వేణుగోపాల స్వామి ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగలు. సమయం: ఉదయం 6 గంటల నుండి – 11గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు.