తోడా రాయ్ సింగ్ పట్టణం రాజస్తాన్ లోని టో౦క్ జిల్లాలో తోడా రాయ్ సింగ్ ఒక పట్టణం. దీనిని 4 వ శతాబ్దంలో నాగా వంశీయులు నిర్మించగా తరువాతి కాలంలో చత్సూ యూహిలాలు, అజ్మీర్ చౌహాన్ లు పరిపాలించారు. 15, 16 వ శతాబ్దాలలో ఇది సోలంకి రాజపుత్రుల రాజధాని. ఈ ప్రాంతంలో ప్రసిద్ధ పాలకుడైన రైల్ సింగ్ సిసోడియా పేరు ఈ పట్టణానికి పెట్టారు.
షాజహాన్ శకం లో ఈయన మొఘల్ మునసబుదారుగా ఉండేవారు. తోడా రాయ్ సింగ్ లో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. శ్రీ కిలేశ్వర్ మహాదేవ, నహర్సింగ్ మాతా, ఆమ్ సాగర్, బుద్ధ సాగర్, సంత్ పిపా జీ కీ గుఫా, కుశాల్ బాగ్, హాది రానీ కీ బావురీ (కుండ్), రాజా రాయ్ సింగ్ మహల్, ఇసార్ బావురీ, భోపట్ భావురీ ఇక్కడ గల కొన్ని ప్రసిద్ధ ఆకర్షణలు.
అలాగే, ఇక్కడ అనేక అందమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. కళ్యాణ్జీ, రాఘోరాయ్ జీ, గోపీనాథ్ జీ, గోవింద్ డియో జీ చెప్పుకోదగిన కొన్ని దేవాలయాలు.