ఇదం శరీరం కౌంతేయ క్షేత్ర మిత్యభిదీయతే - అంటుంది భగవద్గీత. ఈ శరీరమే ఓ క్షేత్రమని గీతావాక్కు. క్షేత్రం అంటే దేవాలయమన్న అర్థమూ ఉంది. దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః - అన్న ఆగమవాక్యం కూడా ఆ విషయాన్నే చాటుతోంది. భారతదేశంలో యాభై లక్షలకుపైగా ఆలయాలున్నాయని అంచనా. స్వయంభూ ఆలయాలూ, పురాణ ప్రాధాన్యమున్న శక్తిపీఠాలూ, శంకరభగవత్పాదులు-రామానుజులు- మధ్వాచార్యులూ తదితర దివ్యపురుషులు ప్రతిష్ఠించిన మహిమాన్విత మూర్తులూ, చోళులు-పల్లవులు- కాకతీయులు-విజయనగర ప్రభువులూ...పాలకులు ప్రాణంపోసిన క్షేత్రాలూ - ఒకటారెండా ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు.
అందులో ప్రధాన క్షేత్రాల నమూనాలన్నీ ఓ చోట కొలువైతే...నమూనాలేమిటి, అక్కడ జరిగే పూజాదికాలన్నీ ఇక్కడా జరిగితే... నైవేద్యాలూ అచ్చంగా అలానే ఉంటే...ఇంకేముంది, సంపూర్ణ యాత్రా ఫలమే, సర్వదేవతా కటాక్షమే!
ఈ నెలలో టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి
1. శక్తి పీఠాల నమూనాలూ
దేశంలోని ప్రధాన వైష్ణవ క్షేత్రాలూ శైవ ఆలయాలూ శక్తి పీఠాల నమూనాలూ అక్కడ కొలువయ్యాయి.
pc:youtube
2. సంపూర్ణ తీర్థయాత్రలు
మూలవిరాట్టుల పూజలూ నైవేద్యాలూ నిజ క్షేత్రాల్ని తలపించేలా ఉంటాయి. రాజమండ్రికి దగ్గర్లోని గాదరాడ గ్రామాన్ని సందర్శిస్తే సంపూర్ణ తీర్థయాత్రలు చేసొచ్చినంత సంతృప్తి.
pc:youtube
3. ఓం శివశక్తి పీఠం
రాజమండ్రి సమీపంలోని గాదరాడ గ్రామంలో కోట్లాది రూపాయల వ్యయంతో... 'ఓం శివశక్తి పీఠం' పేరుతో సకల దేవతామూర్తుల సమాహారంగా ఆలయ సముదాయాన్ని నిర్మించారు బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు.
pc:youtube
4. సేవా కార్యక్రమాలు
బలరామకృష్ణ వ్యాపారవేత్త. చాలాకాలం క్రితమే రాజమండ్రిలో స్థిరపడ్డారు. అయినా, మూలాల్ని మరచిపోలేదు. స్వగ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
pc:youtube
5. గొప్ప కోవెల
వూళ్లో చిన్నచిన్న గుళ్లూ గోపురాలూ చాలానే ఉన్నా, చెప్పుకోదగ్గ ప్రధాన ఆలయం ఒక్కటీ లేకపోవడం లోటుగా అనిపించేది. దీంతో, వూరంతా గర్వపడేలా ఓ గొప్ప కోవెల నిర్మించాలనే నిర్ణయానికొచ్చారు.
pc:youtube
6. ఏ ఆలయాన్ని నిర్మించాలి ?
'ఏ ఆలయాన్ని నిర్మించాలి?' అన్న ప్రశ్న తలెత్తినప్పుడు ఎంతోమంది మఠాధిపతుల్నీ గురువుల్నీ కలిశారు. ఒకరు వైష్ణవ క్షేత్రాన్ని నిర్మించమన్నారు, మరొకరు శివ లింగాన్ని ప్రతిష్ఠించమన్నారు, ఇంకొకరు అమ్మవారి గుడి కట్టమన్నారు. అన్నీ ఉత్తమంగానే అనిపించాయి.
pc:youtube
7. కుటుంబ సభ్యులూ
సర్వదేవతల ఆలయాల్నీ నిర్మించాలన్న ఆలోచన అప్పుడు కలిగిందే. జీవితభాగస్వామి వెంకటలక్ష్మి భర్త సంకల్పానికి మద్దతు ఇచ్చారు. మిగతా కుటుంబ సభ్యులూ మేమున్నామని ముందుకొచ్చారు.
pc:youtube
8. నియమం
విరాళాల కోసమో సాయం కోసమో ఎవర్నీ ఆశ్రయించకూడదనే నియమం పెట్టుకున్నారు. ఎక్కడెక్కడి శిల్పుల్నో పిలిపించారు. ఇంజినీర్లతో మాట్లాడారు.
pc:youtube
9. నాలుగేళ్లు
రేయింబవళ్లు శ్రమించినా, ఆలయ సముదాయానికి ఓ రూపం రావడానికి నాలుగేళ్లు పట్టింది.
pc:youtube
10. ఎన్నో ఆలయాలు !
పీఠం ఆవరణలో మొత్తం యాభై నాలుగు దేవాలయాలున్నాయి. ఎనభై నాలుగు దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించారు.
pc:youtube
11. కైలాస మహాక్షేత్రాలు
కైలాస మహాక్షేత్రాలుగా (21), వైకుంఠ క్షేత్రాలుగా (15), శక్తిపీఠాలుగా (18) వాటిని విభజించారు.
pc:youtube
12. పన్నెండు లింగాలూ
కైలాసక్షేత్రాల్లో...ద్వాదశ జ్యోతిర్లింగాలైన సౌరాష్ట్రలోని సోమనాథ లింగం, శ్రీశైలంలోని మల్లికార్జున లింగం, ఉజ్జయినిలోని మహాకాళేశ్వరలింగం...ఇలా పన్నెండు లింగాలూ కొలువయ్యాయి.
pc:youtube
13. వేంకటేశ్వరస్వామి ఆలయం
ఇక్కడే ఆనందనిలయ వాసుడిని అర్చించుకోవచ్చు - భూదేవి, శ్రీదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది.
pc:youtube
14. సద్గురు సాయిబాబా మందిరం
ఇక్కడే షిర్డీనాథుడిని ప్రార్థించుకోవచ్చు - సద్గురు సాయిబాబా మందిరం ఉంది. ఇదే భద్రాది, ఇదే అన్నవరం, ఇదే యాదాద్రి, ఇదే అరసవల్లి...కోదండ రామస్వామి, రమాసత్యనారాయణ స్వామి, లక్ష్మీనరసింహస్వామి, సూర్యనారాయణమూర్తి ఆలయాలు ఇక్కడున్నాయి.
pc:youtube
15. పూజాదికాలు
శివుడి పరివార దేవతలకు శైవాగమం ప్రకారమూ వైష్ణవాలయాల్లో వైఖానస ఆగమ సంప్రదాయాల ప్రకారమూ పూజలు నిర్వహిస్తారు.
pc:youtube
16. సతీసమేతం
మూల దేవస్థానాల్లో ఏ దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని ఆ దేవుడికి శాస్త్రోక్తంగా నివేదిస్తారు. దేశంలో ఎక్కడాలేని విధంగా నవగ్రహాలను సతీసమేతంగా ప్రతిష్ఠించారు.
pc:youtube
17. గోశాల
విగ్రహ ప్రతిష్ఠాపన తమిళనాడుకు చెందిన 108 మంది వేదపండితుల సారథ్యంలో జరిగింది. ఆశ్రమంలో ఓ గోశాల ఉంది. వేదపాఠశాల నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
pc:youtube
18. అర్ధనారీశ్వరుడు
ఆలయంలోకి వెళ్లగానే, 32 అడుగుల ఎత్తుతో అర్ధనారీశ్వరుడు భక్తులకు స్వాగతం పలుకుతాడు.
pc:youtube
19. నిత్యాన్నదాన పథకం
భవిష్యత్తులో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించాలన్న ఆలోచన కూడా ఉందంటారు ఆలయ కార్యనిర్వహణాధికారి ధర్మవరపు వెంకటనారాయణశర్మ.
pc:youtube
20. ఈ గ్రామానికి ఎలా చేరుకోవాలి
రాజమండ్రి నుంచి కోరుకొండకు చక్కని రవాణా సౌకర్యం ఉంది. అక్కడి నుంచి గాదరాడకు ఆటోలు ఉంటాయి.
pc:youtube
21. త్రేతాయుగం నాటి ఆలయం
తిరుగు ప్రయాణంలో కోరుకొండలోని లక్ష్మీనరసింహస్వామిని కూడా దర్శించుకోవచ్చు. గుట్టమీదున్న ఆలయం త్రేతాయుగం నాటిదని అంటారు.
pc:youtube
- సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళిన గుహ రహస్యం తెలుసా ?
- ఇండియాలో రాబోతున్న టాప్ 6 మెగా టెంపుల్స్ ఏవేవో తెలుసా?
- మీలో ఎంతమందికి హిమాలయాలలోని మిస్టరీ మనిషి గురించి తెలుసు ?