యుగాంతం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించిన చిత్రం యుగాంతం 2012. అగ్నిపర్వతాలు బద్దలవటం, భూకంపాలు, సునామీలు ... ఇలా ఎన్నో ప్రకృతి వైపరిత్యాల కారణంగా యుగాంతం అంతమవుతుందని(అవుతుందో .. లేదో ...అది తీరిక ఉంటే తరువాత ఆలోచిద్దాం ..!) పసిగట్టి ఆ ఇంగ్లీష్ వాళ్ళు తీసిన సినిమా ఇది. వాళ్ళకి సైన్స్ బాగా అంటబట్టింది కాబట్టి ఆ విధంగా తీశారు.
మనవాళ్ళు పురాణాలు, ఇతిహాసాలు బాగా అవపోసన పట్టిన వాళ్ళు కాబట్టి, యుగంతం ఎలా వస్తుందో అని స్వామీజీ వద్దకు వెళ్ళి అడిగితే - 'ఎప్పుడైతే పాపాత్ముల సంఖ్య భూమి మీద పెరిగిపోతుందో అప్పుడు దేవుడు భూమిని భస్మం చేస్తాడని(అన్నింటికీ దేవుడే అన్నట్టు..!)' చెప్పేస్తారు.
శివుడు మూడో కన్ను తెరుస్తాడో? లేడో? మనకైతే తెలీదు కానీ నాలుగో స్తంభం విరిగితే మాత్రం యుగాంతం వస్తుందని అక్కడి వారి ప్రగాఢ నమ్మకం. అక్కడంటే ఎక్కడో అనుకొనెరు. స్వయాన మన భారతదేశంలోనే మహారాష్ట్ర రాష్ట్రంలో ..!
మహారాష్ట్ర లో ఎన్నో నదులకు, ప్రకృతి అందాలకు పుట్టినిల్లైన పశ్చిమ కనుమల్లో ఉంది ఆ ప్రాంతం. ఆ ప్రాంతం ఒక హిల్ స్టేషన్ మరియు అక్కడికి చేరుకోవాలంటే ట్రెక్కింగ్ వంటి సాహసాలు చేయాలి. ఇంతకు ఈ ప్రదేశం చెప్పలేదు కదూ ..! హరిశ్చంద్రగడ్.
హరిశ్చంద్రగడ్ ఒక హిల్ ఫోర్ట్ అంటే కొండ కోట. కొండ మీద ఒక కోట ఉంటుంది. ఆ కోటలో ఇంతవరకు చెప్పానే యుగాంతం అని ఆ అలజడి రేపే అంశాలు దాగి ఉన్నాయి. హరిశ్చంద్రగడ్ అహ్మద్ నగర్ జిల్లా కు చెందినదైనా దాని చరిత్ర మాత్రం దగ్గర్లోని మల్షేజ్ ఘాట్ తో ముడిపడి ఉన్నది. ఇక ఆలస్యం ఎందుకు ? ఎలాగైనా అక్కడికి వెళ్తాం కదా .. ఆ వెళ్లెదీ కూడా మల్షేజ్ ఘాట్ మీదనే. దాన్ని కూడా చూస్తూ ... చివర ఆ యుగాంతం చేరుకుందాం స్వామీ అని !
మల్షేజ్ ఘాట్ ఎలా చేరుకోవాలి ?
విమాన మార్గం
మల్షేజ్ ఘాట్ కు సమీపాన 150 కి. మీ. దూరంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. అక్కడి నుంచి క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి మల్షేజ్ ఘాట్ చేరుకోవచ్చు.
రైలు మార్గం
కల్యాణ్ రైల్వే స్టేషన్ మల్షేజ్ ఘాట్ కు 80 కి. మీ. దూరంలో ఉన్న సమీప స్టేషన్. స్టేషన్ నుంచి గంటన్నార లో అక్కడికి చేరుకోవచ్చు.
రోడ్డు మార్గం
ముంబై, పూణే, కల్యాణ్ నుండి మల్షేజ్ ఘాట్ కు నిత్యం ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు, వాహనాలు తిరుగుతుంటాయి.
చిత్ర కృప : Elroy Serrao
మల్షేజ్ ఘాట్
మల్షేజ్ ఘాట్ పశ్చిమ కనుమల్లో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది పూణే జిల్లాలో కలదు. సముద్ర మట్టానికి 700 మీ. ఎత్తున ఉండే ఈ ప్రదేశం ట్రెక్కర్లకు, పర్వతారోహకులకు, ప్రకృతి ప్రేమికులకు మరియు సరదా రాయుళ్లకు ఆహ్లాదకరమైన ఆనందాన్ని ఇస్తుంది.
చిత్ర కృప : Aditya Patawari
మల్షేజ్ ఘాట్ లో ఏమి చూడాలి?
శివాజీ పుట్టిన కోట, అందమైన జలపాతాలు, డ్యామ్, ఆ డ్యామ్ కు వచ్చే ప్లేమింగో పక్షులను చూడటం మరిచిపోకండి.
చిత్ర కృప : Aditya Patawari
మల్షేజ్ జలపాతాలు
మల్షేజ్ జలపాతాలు సహజ అందాలకు ప్రసిద్ధి. పై నుండి కిందకు కు పదే ఆ నీటి ధార ప్రవాహం చూపరులను ఆకట్టు కుంటుంది. ఈ ప్రదేశం వర్షాకాలం స్వర్గధామం అనుకోండీ ..!
చిత్ర కృప : Pranav Prakash
పిమ్పల్గావ్ జోగా డ్యామ్
పిమ్పల్గావ్ జోగా డ్యామ్ చుట్టుపక్కల ప్రాంతాల అందాలను అందించే అద్భుతమైన దృశ్యాల నెలవుగా వుంది. జామ పోలంక, విస్లింగ్ త్రష్, కంజు పిట్ట, నీల బోలకోడి లాంటి పక్షుల విహంగ వీక్షణలను చూసి పక్షి ప్రేమికులు ఆనందిస్తారు. ఫ్లెమింగో లాంటి వలస పక్షులు కూడా ఇక్కడ చూడవచ్చు.
చిత్ర కృప : Harsha Aruru
హరిశ్చంద్రగడ్
ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆ ప్రదేశం రానే వచ్చింది .... హరిశ్చంద్రగడ్. మల్షేజ్ ఘాట్ నుంచి ఈ ప్రదేశం దగ్గరదగ్గర 95 కి. మీ. దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశంలో పర్వతారోహణ సూచించదగినది.
చిత్ర కృప : Cj.samson
హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?
హరిశ్చంద్ర గడ్ థానే, పూణే మరియు అహ్మద్ నగర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్నది. థానే జిల్లా నుంచి : థానే నుంచి కల్యాణ్ అనే పేరుగల ఊరికి బోర్డ్ తగిలించి ఒక బస్సు ఉంటుంది. ఆ బస్సులో ఎక్కి ఖుబిఫట గ్రామానికి చేరుకోవాలి. అక్కడి నుంచి ఖిరేశ్వర్ గ్రామానికి బస్సు లేదా ప్రవేట్ వాహనాల్లో ప్రయాణించాలి. ఖిరేశ్వర్ నుంచి 7 కి. మీ. వరకు ట్రెక్కింగ్ చేస్తే కొండమీదున్న హరిశ్చంద్రగడ్ కోట చేరుకోవచ్చు.
చిత్ర కృప : S A C H 5
హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?
పూణే లోని శివాజీనగర్ ఎస్ టి బస్ స్టాండ్ నుండి ప్రతి రోజూ ఖిరేశ్వర్ కు బస్సులు నడుస్తాయి.
చిత్ర కృప : Moron Kreacionz
హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?
అహ్మద్ నగర్ జిల్లా నుంచి : నాసిక్, ముంబై లేదా అలైట్ కు వెళ్లే బస్సులు ఎక్కి ఘోటి గ్రామం చేరుకోవాలి. ఘోటి నుంచి సంగమ్నేర్ వయా మలేగావ్ మరియు అలైట్ బస్సులు ఎక్కి రాజూర్ గ్రామం చేరుకోవాలి. ఈ గ్రామం నుంచి 3 దారుల్లో కోట కు చేరుకోవచ్చు.
చిత్ర కృప : Anil Vesvikar
హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?
రాజూర్ గ్రామం నుంచి పచనై గ్రామం వరకు బస్సులో లేదా ప్రవేట్ వాహనాల్లో ప్రయాణించాలి. అక్కడి నుంచి నేరుగా ఉన్న మార్గంలో ఆ ఎత్తైన చోటుకి చేరుకోవాలి.
చిత్ర కృప : S A C H 5
హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?
కొత్తగా రాజూర్ నుంచి కొథలె(లోయ ప్రాంతం) వరకు రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. లోయ నుండి 2 - 3 గంటలు కాలినడకన వెళ్తే యుగాంతం చోటు కు వెళ్ళవచ్చు.
చిత్ర కృప : aditya mestry
హరిశ్చంద్రగడ్ ఎలా చేరుకోవాలి ?
కోటుల్ నుండి కొథలె వరకు లోయ ప్రాంతమైన తోలార్ ఖింద్ మార్గం గుండా ప్రభుత్వ / ప్రవేట్ వాహనాల సౌకర్యం గంట గంట కు ఉన్నది.
చిత్ర కృప : ssriram_mt
కొండ మీదకి చేరుకోవటానికి మార్గాలు
కొండ మీదకి చేరుకోవటానికి 4 -5 మార్గాలు ఉన్నాయి. అందులో ప్రసిద్ధి గాంచిన రూట్లు ఖిరేశ్వర్ నుంచి గుహలు, వాటర్ ట్యాంక్ ల ను దాటుకుంటూ జున్నార్ దర్వాజా వరకు చేరుకోవాలి. అక్కడి నుండి నేరుగా తోలార్ ఖింద్ కు చేరుకొని కొద్ది దూరం నడవాలి. రాళ్ళ గుట్టలను, తక్కువ అడవులున్న పీఠభూమి మైదానాలను, ఏడు కొండలను దాటుకుంటూ 2 - 3 గంటలు నడిస్తే హరిశ్చంద్రగడ్ చేరుకోవచ్చు. గమనిక : నడిచి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో గుర్తులు ఉపయోగ పడతాయి.
కొండ మీదకి చేరుకోవటానికి మార్గాలు
ఈ ఏడు కొండలను స్కిప్ చేసి వెళ్లే మార్గం ఒకటి ఉన్నది. అది దట్టమైన అటవి ప్రాంతం కనుక వెళ్తే సమూహంగా(గ్రూప్ లుగా) వెళ్ళాలి. ఈ మార్గాన్ని బలెకిల్ల అంటారు. తోలార్ ఖింద్ నుండి రాక్ క్లైంబింగ్ చేసుంటూ వెళ్తున్న తప్పక ఆయాసం వస్తుంది. కాస్త ఆగుతూ వెళ్ళాలి. ఇలా వెళితే 1 -2 గంటల్లో హరిశ్చంద్రగడ్ చేరుకోవచ్చు.
చిత్ర కృప : Samtrek India
కొండ మీదకి చేరుకోవటానికి మార్గాలు
బెల్పడ మల్షేజ్ ఘాట్ నుంచి కల్యాణ్ వెళ్లే మార్గంలో బెల్పడ గ్రామం ఉన్నది. అక్కడి నుంచి వయా సధ్లెఘాట్ గుండా 1 కిలోమీటరు దూరం నుడుచుకుంటూ దారిమధ్యలో ఎత్తుపల్లాలను, ఏటా వాలు రాళ్ళను దాటుకుంటూ వెళితే హరిశ్చంద్ర గడ్ చేరుకోవచ్చు.
కొండ మీదకి చేరుకోవటానికి మార్గాలు
కొథలె నుండి హరిశ్చంద్ర గడ్ కు చేరుకోవటానికి సూచించదగిన మరో మార్గం కొథలె గ్రామం. ఇక్కడి నుంచి కోట మూడు కిలోమీటర్లు. నడక మార్గాన వెళ్తున్న మీరు అడవి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించవచ్చు. దారి మద్యలో నీటి తో నిండిన కుంట లను, చెరువులను గమనించవచ్చు.
చిత్ర కృప : Nikhil Rane
హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు
కొండ మీద చూడవలసినది కోట. కోట పురాతమైనది చాలా వరకు శిధిలాలు కనిపిస్తాయి. ఈ ప్రదేశం గురించి మత్స్య పురాణం, అగ్ని పురాణం, స్కంద పురాణాల్లో పేర్కొన్నారు. కోటను కాలచూరి వంశీయులు నిర్మించారు. కోట సముద్ర మట్టానికి 1424 మీ. ఎత్తున ఉంటుంది.
చిత్ర కృప : abhijitsony
హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు
కోట ఆవరణలో అందమైన విష్ణు దేవాలయం దగ్గర్లో పురాతన బౌద్ధ గుహలు ఉన్నాయి. మధ్య యుగ కాలానికి చెందిన నాగేశ్వర్ ఆలయం, హరిశ్చంద్రేశ్వర్ ఆలయం మరియు కేదారేశ్వర్ గుహాలయం కూడా సమీపంలోనే ఉన్నాయి.
హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన ఆకర్షణీయ ప్రదేశాలు
సప్త తీర్థ పుష్కరణి ఆలయానికి తూర్పు వైపున సప్త తీర్థ పుష్కరణి చెరువు ఉన్నది. ఈ చెరువు ఒడ్డున ఆలయ నిర్మాణం మాదిరి కనిపించే కట్టడం ఒకటుంది. అందులో విష్ణు ప్రతిమలు ఉన్నాయి. మొన్ననే ఆ విగ్రహాలను గుహలకు దగ్గర్లోని హరిశ్చంద్రేశ్వర్ ఆలయానికి తరలించారు.
హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన ఆకర్షణీయ ప్రదేశాలు
సప్త తీర్థ పుష్కరణి వచ్చి పోయే ట్రెక్కర్లు ఈ చెరువు వద్దకు వచ్చి ప్లాస్టిక్ వస్తువులను పడేసేవారు దాంతో గత 7 సంవత్సరాల నుంచి ఈ చెరువు కనీసం స్విమ్ చేయటానికి కూడా ఉపయోగపడటం లేదు. వేసవిలో ఈచెరువు ఒడ్డున నిలబడితే చల్లగా ... ఫ్రిజ్ ముందర నిలబడ్డట్టు ఉంటుంది.
చిత్ర కృప : gemsuraj1987
హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన ఆకర్షణీయ ప్రదేశాలు
కేదారేశ్వర్ గుహాలయం పక్క చిత్రంలో మీరు చూస్తున్నది అపురూపమైన, అద్భుతమైన కట్టడం. ఇది అహ్మద్ నగర్ జిల్లాలోని హరిచంద్ర కోట లో ఉన్న కేదారేశ్వర్ స్వామి ఆలయం. ఈ మందిరం పైన ఒక పెద్ద బండరాయి, కింద 4 స్తంభాల పై గుడి కట్టారు. ఇది ఎప్పుడు నిర్మించారో ఎవరికీ తెలీదు. ఎవరు నిర్మించారో కూడా తెలీదు.
చిత్ర కృప : rohit gowaikar
హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన ఆకర్షనీయ ప్రదేశాలు
కేదారేశ్వర్ గుహాలయం కానీ ఇక్కడున్న నాలుగు స్తంభాలు 4 యుగాలకి(సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం) సంకేతాలు గా నిలిచాయి. ఒక్కో యుగాంతానికి ఒక్కో స్తంభం విరిగిపోతుంది.
హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన ఆకర్షనీయ ప్రదేశాలు
కేదారేశ్వర్ గుహాలయం ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కనుక, ఈ పెద్ద బండరాయి ఒక స్తంభం పైన మాత్రమే వున్నది. ఎప్పుడైతే ఈ స్తంభం కూడా విరిగిపోతుందో ఆ రోజు ఈ కలియుగానికి ఆఖరి రోజు గా నిర్దారించారు...!! అంతటి మహాత్వమైన గోపురం ఇది...
చిత్ర కృప : Ninad Shelar
హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన ఆకర్షనీయ ప్రదేశాలు
కేదారేశ్వర్ గుహాలయం ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏమిటంటే ... గుడి 4 గోడలు నుండి నీరు ప్రతి రోజు వస్తూనే వుంటుంది. ఆ నీరు చల్లగా ఉండటం వల్ల ఎవరూ లోనికి వెళ్ళరు. వర్షాకాలంలో మాత్రం ఒక్క చుక్క నీరు గుడి లో ఉండదు...!! వేసవి, శీతాకాలం లో 5 అడుగుల మేర ఎత్తులో నీరు వుంటుంది
హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన ఆకర్షనీయ ప్రదేశాలు
కొంకణ్ క్లిఫ్ ఇక్కడ అద్భుతమైన సూర్యోదయాలను, సూర్యాస్తమాలను చూడవచ్చు. ప్రకృతి అందాలను, లోయ అందాలను, సహజ ప్రకృతి సన్నివేశాలను కూడా గమనించవచ్చు.
చిత్ర కృప : Nagraj Salian
హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన ఆకర్షనీయ ప్రదేశాలు
తారామతి పీక్ / తారామంచి ఈ పిక్నిక్ ప్రదేశం సముద్ర మట్టానికి 1429 మీ. ఎత్తున ఉంటుంది. దీనికి అనుకోని ఉన్న అడవుల్లో చిరుత లను చూడవచ్చు. పశ్చిమ కనుమల లోని కసర రీజన్ లో ఘోడ్శెప్(865 మీ.), అజోబా (1375 మీ) కులాంగ్ ఫోర్ట్(1471 మీ) లను కూడా చూడవచ్చు కానీ మసక మసక గా కనిపిస్తాయి.
చిత్ర కృప : Mahesh Kamble
హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన ఆకర్షనీయ ప్రదేశాలు
హరిశ్చంద్రగడ్ గుహలు దాదాపు కోట అంతటా గుహలు విస్తరించాయి. వాటిలో కొన్ని తారామని పీక్ వద్ద మరియు బస చేసే వద్ద ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి.
చిత్ర కృప : Mahesh Kamble
హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన ఆకర్షనీయ ప్రదేశాలు
నాగేశ్వర్ ఆలయం, ఖిరేశ్వర్ దగ్గర ఇదొక విష్ణు దేవాలయం. ఇది ఖిరేశ్వర్ సమీపంలో ఉన్నది. ఇందులో ప్రధాన దైవం విష్ణువు. శిల్పం 1.5 మీ. పొడవు ఉండి విష్ణువు పడుకొని ఉన్న భంగిమలో ఉంటాడు.
చిత్ర కృప : aditya mestry
హరిశ్చంద్రగడ్ లో చూడవలసిన ఆకర్షనీయ ప్రదేశాలు
హరిశ్చంద్రేశ్వర్ ఆలయం ఇదొక గుహాలయం. ట్రెక్కింగ్ కు వచ్చే వారు ఇక్కడ వసతి పొందవచ్చు. సమీపంలో అనేక వాటర్ ట్యాంక్ కు ఉన్నాయి. ఆలయ రాతి నిర్మాణం నిజంగా ఆశ్చర్యం కలిగించక మానదు. గణపతి విగ్రహం నల్లటి రాతి నిర్మాణాల మధ్య చెక్కుచెదరకుండా భక్తులను, యాత్రికులను ఆకట్టుకుంటున్నది.
చిత్ర కృప : rohit gowaikar
వసతి సౌకర్యాలు
కొండ మీద ఉన్న గుహాల్లో గణేశ్ ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో 50 వరకు వసతి కల్పించవచ్చు. క్యాంపైనింగ్ కూడా సూచించదగినది.
వసతి సౌకర్యాలు
కొథలె గ్రామంలో వసతి కొథలె గ్రామంలో బస చేయటానికి చారిటబుల్ ట్రస్ట్ వారు, సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళు , దాతలు తక్కువ ధరకే వసతి సదుపాయం కలిపిస్తున్నారు.
వసతి సౌకర్యాలు
ఖిరేశ్వర్ వసతి ఖిరేశ్వర్ లో రాత్రి పూట బస చేయటానికి లోకల్ స్కూల్ ఉత్తమం. ఇక్కడ చూడటానికి నాగేశ్వర్ ఆలయం మరియు యాదవ గుహలు ఉన్నాయి. పచ్నై గ్రామం లో రాత్రి పూట బస చేయటానికి హనుమాన్ ఆలయం సూచించదగినది.
చిత్ర కృప : aditya mestry
భోజన సౌకర్యాలు
సమ్మర్ లో, వింటర్ లో స్థానికులు తయారు చేసిన వంటలను గుహల వద్ద అమ్ముతుంటారు కాబట్టి తినొచ్చు. ఐతే, మాన్సూన్ లో వాతావరణ పరిస్థితుల కారణంగా వారు వంటలు చేయరు అప్పుడు మనమే స్వయంపాకం చేసుకోవాల్సిందే ..!
చిత్ర కృప : gemsuraj1987
తాగునీటి సౌకర్యం
తాగునీటి అవసరాలకై నిర్మించిన వాటర్ ట్యాంక్ కు గుహల వద్ద ఉన్నాయి. ఇవి సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి. తోలార్ ఖింద్ మరియు హరిశ్చంద్రగడ్ వద్ద వేసవి మరియు వింటర్ సీజన్ లో నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ అమ్ముతారు.
చిత్ర కృప : Amarnujju