బృందావనం లేదా బృందావన్ గార్డెన్స్ కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరానికి చేరువలో ప్రవహిస్తున్న కావేరి నది పై నిర్మించిన కృష్ణరాజసాగర డ్యాం ను అనుకోని ఉన్నది. ఈ ఉద్యానవనం మైసూర్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు నుండి 144 కిలోమీటర్ల దూరంలో కలదు. మైసూర్ వచ్చే ప్రతి పర్యాటకుడు బృందావనం గార్డెన్ చూడనిదే పర్యటన పూర్తికాదు. దీని గురించి మరిన్ని వివరాలు క్లుప్తంగా ... !
అది మహారాజుల తోట ... సాయంత్రం అయ్యిందంటే అక్కడ రాజ కుటుంబాలు వాలిపోతుంటారు. రాజ కుటుంబీకుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన తోట నేడు దేశ, విదేశ పర్యాటకులకు ఒక గమ్యస్థానం. ఏటా ఆ తోటలను సందర్శించటానికి పాతిక లక్షలు పైగా వస్తుంటారని అంచనా. మైసూర్ దగ్గరలో ఉన్న ఆ ఉద్యానవనమే ... బృందావన్ లేదా బృందావనం !!
బస్ స్టాప్
మైసూర్ ప్యాలెస్ బస్ స్టాప్ నుంచి బృందావన్ గార్డెన్స్ కు అనేక ప్రవేట్, సిటీ బస్సులు తిరుగుతాయి. మైసూర్ ప్యాలెస్ నుండి అరగంట ప్రయాణంలో ఈ బృందావన్ ఉద్యానవనం చేరుకోవచ్చు.
pc: Sugnyan
కృష్ణరాజసాగర డ్యామ్
బృందావన్ గార్డెన్స్ కు నీటి కొదువలేదు. పక్కనే డ్యాం ఉండటంచేత నీరు నిరంతరం అందుబాటులో ఉంటుంది. అందమైన మొక్కలు, పచ్చిక బయళ్ళు, ఫౌంటైన్ లు కలవు.
pc: PP Yoonus
ఉద్యానవనం
ఉద్యానవనం మొత్తం చూసిరావటానికి రెండు - మూడు గంటల సమయం పడుతుంది. ఇది సుమారు 60 ఎకరాలకు పైగా విస్తరించింది.
pc: Joe Ravi
వెలుతురు
ఉదయం వేళ కంటే సాయంత్రం వేళ గార్డెన్ సందర్శన ఉత్తమం. సాయంత్రం తోటలను అందమైన రంగురంగుల విదుద్దీపాలతో అలంకరిస్తారు. ఆహ్లాదకరమైన సంధ్యాసమయాన్ని ఆస్వాదించవచ్చు. బృందావనం లో లైట్లు ప్రతిరోజూ సాయంత్రం 7 నుండి రాత్రి 8 గంటల వరకు వెలుగుతాయి.
pc: Rishabh Mathur
లైట్ కాంతులు
చిన్న,పెద్ద ఫౌంటైన్ ల నీటి పొంగులు మరియు లైట్ లతో అలంకరించబడిన వివిధ ఉద్యానవనాలు మొదలైన ప్రత్యేకతలు ఎన్నో పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి.
pc: Rohin
ఉద్యానవనం
దీనిని ఒకప్పుడు కృష్ణరాజ టెర్రస్ గార్డెన్స్ అని పిలిచేవారు. 1927 వ సంవత్సరంలో ఈ ఉద్యానవనం పనులు ప్రారంభించి 1932 వ సంవత్సరంలో పూర్తి చేశారు. కె. ఆర్. ఎస్. డ్యాం ను భారతరత్న విశ్వేశ్వరయ్య నిర్మిస్తే, ఉద్యానవనమును సర్ మీర్జా ఇస్మాయిల్ కట్టించెను.
pc: Ashwin Kumar
సరస్సు
గార్డెన్ లో బొటానికల్ గార్డెన్స్, వాటర్ ఫౌంటైన్స్ మరియు సరస్సులు కలిగి ఉన్నది. సరస్సులలో బోట్ రైడ్ ను ఎంజాయ్ చేయవచ్చు.
pc: MikeLynch