మనం చేసే పాపాలే మనకు శాపాలుగా మారతాయా?అవునని పెద్దవాళ్ళు చేపుతూవుంటే కొన్ని సార్లు అంతా ట్రాష్ అనిపిస్తుంది.కానీ కొన్ని సంఘటనలు చూశాక అది నిజమేనేమో అనిపిస్తుంది. ఒక రాణి శాపం కారణంగా తలకడు అనే ఒక చారిత్రాత్మక నగరం.ఈ ప్రాంతంలోని ఆలయాలు ఇసుకలో కూరుకునిపోయివుంటాయి.విచిత్రం ఏమిటంటే ఎన్ని సార్లు ఆర్కియాలిజికల్ వాళ్ళు వెలికితీసినా ఇవి తిరిగి ఇసుకలోనికే వెళ్ళిపోతాయి. దీని వెనక ఒక రాణి శాపం వుందని అందుకే ఆ నగరం ఇసుకలో సమాధి అయిందని చారిత్రక కధనం.
తలకడు ఎడారిగా మారిపోయిన ఒక నగరం. ఇది మైసూరుకి 45కి.మీ ల దూరంలో బెంగుళూరుకి 133కి.మీ ల దూరంలో కర్ణాటకలో వుంది.ఇక్కడ 30 పైగా దేవాలయాలు ఉండేవని, అన్నీ ఇసకలో సమాధి అయిపోయాయని ఈ నగరానికి తల,కడు అనే ఇద్దరు ట్విన్ బ్రదర్స్ పేరుమీద ఈ నగరం ఏర్పడిందంట.
తలకాడు
ఇది కూడా చదవండి: తలకాడు పంచలింగేశ్వర దర్శనం !
1. అంతుపట్టని వ్యాధి
శ్రీరంగరాయ అనే రాజు అనారోగ్యంతో అంతుపట్టని వ్యాధితో అనారోగ్యంతో బాధపడుతూవుంటే పూజలు చేస్తే ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పటంతో వస్తారట.రాజ్యం యొక్క పరిపాలన అతని భార్య అలమేలమ్మకు అప్పగిస్తాడట.
తలకాడు - మరచిన దేవాలయాలు !
PC:రవిచంద్ర
2. శ్రీరంగపట్టణం
కాని రాజు ఆరోగ్యం పూర్తిగా క్షీణించి రాజు చివరి క్షణాలలో ఉన్నాడని తెలిసి ఆ ప్రాంతానికి అలమేలమ్మగూడా రావటం జరుగుతుందట.వచ్చేముందు శ్రీరంగపట్టణం యొక్క అధికారాన్ని రాజా ఒడియర్ కు అప్పగిస్తుందట.
మైసూరులో మంచి హోటల్ వసతులు !
PC:రవిచంద్ర
3. ముక్కుపుడక
కానీ రాజా ఒడియర్ శ్రీరంగాపట్టణ రాజ్యాన్ని హస్తగతం చేసుకుని రాణి అలమేలమ్మ యొక్క ముక్కుపుడక,మొదలగు నగలు,బంగారం కోసం రాణి పైకి సైన్యాన్ని పంపిస్తాడట. అప్పుడు రాణి ఆ నగలను కావేరీ నదిలో పడవేసి తను కూడా ఆ నదిలోకి దూకి ప్రాణాలను త్యాగం చేస్తుందట.
శివ సముద్రం - కావేరి నది రెండుగా చీలే ప్రదేశం !!
PC:రవిచంద్ర
4. ఇసుకదిబ్బ
మరి రాణి ఆ తలకడు మొత్తం ఇసుకదిబ్బగా మారిపోవాలని శపిస్తుందట.అందుకే దీనిని కర్స్ అఫ్ తలకడు సిటీ అంటారు. 16వ శాతాబ్ధంవరకు చారిత్రాత్మక నగరంగా వున్న తలకడు ప్రస్తుతం ఒక ఇసుకదిబ్బగా మారింది.
శ్రీరంగపట్నం - ఆది...మధ్య...అంత పుణ్య క్షేత్రాలు !
PC:youtube
5. వాటర్ ఫాల్స్
మరి 30కిపైగా ఆలయాలు ఇందులో కూరుకుపోగా కేవలం కీర్తినారాయణ ఆలయం మాత్రమే వెలికితీయటం జరిగిందట.మరి దీనికి దగ్గరగా వున్న శివసముద్ర వాటర్ ఫాల్స్ ను కూడా మీరు చూడవచ్చును.
మలై మహాదేశ్వర కొండలు - శివ దర్శన భాగ్యం !!
PC:PROBörkur Sigurbjörnsson
6. శివసముద్ర వాటర్ ఫాల్స్
ఇవి కర్ణాటక మాండ్య జిల్లాలో కావేరీ నది ఒడ్డున వున్నాయి.శివసముద్ర ఐస్ లాండ్ నాల్గవ అతి పెద్ద ఐస్ లాండ్ గా చెప్పుకొనవచ్చును.
నంజన్ గుడ్ నంజున్దేస్వరుడు !!
PC:Prashant Dobhal
7. మైమరచిపోయే వాటర్ ఫాల్స్
ఈ వాటర్ ఫాల్స్ చూడటానికి బెస్ట్ టైం జులై నుంచి అక్టోబర్ మధ్యలో.ఈ వాటర్ ఫాల్స్ ను చూస్తే మనకు మనమే మైమరచిపోతామా అన్నట్టుగా వుంటాయంట.
దసరాలో తప్పక పర్యటించవలసిన 25 ప్రదేశాలు !!
PC:Börkur Sigurbjörnsson
8. శివసముద్ర వాచ్ టవర్
గగనచుక్కి, బారచుక్కి కావేరీ నదిని రెండుగా చీల్చుతాయట.ఇవి శివసముద్ర వాచ్ టవర్ నుంచి చూడవచ్చునట. ఇది బెంగుళూరుకి 139కి.మీ దూరంలో వున్నాయి.
బృందావన్ గార్డెన్స్ .. విరజిమ్మే విద్యుత్ వెలుగులు !
PC:PROBörkur Sigurbjörnsson