జంబు లింగేశ్వర మరియు అఖిలాండేశ్వరి టెంపుల్ ను చోళ రాజులలో మొదటి వాడిన కోచెంగా చోళ నిర్మించారు. టెంపుల్ గోడలపై లిఖిత శాసనాలు కలవు. ఈ టెంపుల్ కనీసం 1,800 ఏళ్ల నాటిది గా చెపుతారు. అయినపటికి ఇది మంచి స్థితి లో కలదు. ఎప్పటికపుడు మరమ్మతులు చేయిస్తుంటారు.
జంబు కేశ్వర లింగం కింద నీరు వుండటం గమనిస్తారు. ఈ నీటిని ఎపుడు ఖాళీ చేసినా సరే, మరల ఆ స్థలం నీటి తో నిండి పోతుంది. ఒక కదా మేరకు పార్వతి శివుడి తపస్సు ను భంగ పరచిందని అపుడు శివుడు కోపించి ఆమెను భూమిపై తపము చేయవలిసిందిగా ఆదేశించిందని అపుడు ఆమె భూమిపై ఇక్కడ అఖిలాండేశ్వరి గా అవతరించి జంబు అడవి లో తపస్సు మొదలు పెట్టిందని అక్కడి కావేరి నది నీటి తో శివ లింగం తయారు చేసిందని చెపుతారు. పార్వతి తపస్సు చేసిన స్థలం లోనే టెంపుల్ నిర్మించారు.
ఏనుగులు ప్రవేశించలేని గుడిలో, ప్రతిరోజూ ఏనుగుచే పూజలు చేయిస్తున్న ఆలయ అర్చకులు
కంఠంలో కాలకూట విషాన్ని దాచుకున్న శివుడు ఆ అగ్ని జ్వాలలు తట్టుకునేందుకు మంచు కొండల మహాపర్వతాల నడుమ ధ్యానంలో కూర్చుంటాడు.అనే విషయం మనలో చాలా మందికి తెలియకపోయుండవచ్చు.
PC: youtube
ఏనుగులు ప్రవేశించలేని గుడిలో, ప్రతిరోజూ ఏనుగుచే పూజలు చేయిస్తున్న ఆలయ అర్చకులు
శివుడు ప్రత్యక్షంగా కాకుండా లింగాకారరూపంలో జల పుణ్యక్షేత్రాలలో గంగను తలపై పెట్టుకుని వెలసివుండడానికి కూడా అసలు కారణం ఇదే.
PC: youtube
ఏనుగులు ప్రవేశించలేని గుడిలో, ప్రతిరోజూ ఏనుగుచే పూజలు చేయిస్తున్న ఆలయ అర్చకులు
అటువంటి పుణ్యక్షేత్రాలలో ఆ పరమశివుడు వెలసిన క్షేత్రమే జంబుకేశ్వరం. పంచభూత క్షేత్రాలలో భక్తులచే పూజలందుకుంటున్న ఈ క్షేత్ర ఇతిహాసం గురించి తెలుసుకుందాం.
PC: youtube
ఏనుగులు ప్రవేశించలేని గుడిలో, ప్రతిరోజూ ఏనుగుచే పూజలు చేయిస్తున్న ఆలయ అర్చకులు
పురాణాలు,ఇతిహాసాల ప్రకారం ఒక పుణ్య కార్యం చేయటానికి దేవుడు భూమిపై వివిధ రూపాలలో కొన్ని ప్రదేశాలలో వెలసిన విషయం ప్రతిఒక్కరికీ తెలిసినదే.
PC: youtube
ఏనుగులు ప్రవేశించలేని గుడిలో, ప్రతిరోజూ ఏనుగుచే పూజలు చేయిస్తున్న ఆలయ అర్చకులు
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చికి 17కి.మీ ల దూరంలో తిరువానై కావాల్ లోని పవిత్ర కావేరీ నది ఒడ్డున జంబుకేశ్వరఆలయం వెలసింది.
PC: youtube
ఏనుగులు ప్రవేశించలేని గుడిలో, ప్రతిరోజూ ఏనుగుచే పూజలు చేయిస్తున్న ఆలయ అర్చకులు
ఇక్కడ శంభుడు అనే ఋషి శివుడికి పరమభక్తుడు. శివుడికి ప్రత్యక్షంగా పూజలు చేయాలని తపస్సు చేయటం మొదలుపెట్టాడు.
PC: youtube
ఏనుగులు ప్రవేశించలేని గుడిలో, ప్రతిరోజూ ఏనుగుచే పూజలు చేయిస్తున్న ఆలయ అర్చకులు
శంభుడి తపస్సుకి మెచ్చి నేను లింగరూపంలో ఇక్కడ వెలుస్తానని,నువ్వు జంబు వృక్షంగా వెలుస్తావని శివుడు శంభుడు కోరిన కోరికకు అంగీకరిస్తాడు. ఇప్పటికి ఆ జంబు వృక్షం అక్కడ మనం చూడవచ్చును.
PC: youtube
ఏనుగులు ప్రవేశించలేని గుడిలో, ప్రతిరోజూ ఏనుగుచే పూజలు చేయిస్తున్న ఆలయ అర్చకులు
అలాగే మరో ఇతిహాసం ప్రకారం జలలింగంలో పూజలందుకుంటున్న జంబుకేశ్వర స్వామివారిని ఏనుగు,సాలెపురుగు,పోటీ పడి పూజలు చేస్తుండేవి. శివుడికి గొడుగు లాగా సాలెపురుగు నిర్మిస్తే, శివుడికి ఏనుగు తొండంతో అభిషేకం పూజలు చేసేది.
PC: youtube
ఏనుగులు ప్రవేశించలేని గుడిలో, ప్రతిరోజూ ఏనుగుచే పూజలు చేయిస్తున్న ఆలయ అర్చకులు
ఏనుగు రాగానే సాలెపురుగు చెట్టు పైకి ఎక్కేది. ఏనుగు చేస్తున్న పనిని సహించలేని సాలె పురుగు ఏనుగు తొండంలో దూరి తన విషంతో ఏనుగును చంపి తాను కూడా చనిపోయింది.
PC: youtube
ఏనుగులు ప్రవేశించలేని గుడిలో, ప్రతిరోజూ ఏనుగుచే పూజలు చేయిస్తున్న ఆలయ అర్చకులు
ఆ తర్వాత సాలెపురుగు మహారాజుగా జన్మించి శివుడిపై వున్న భక్తితో విస్తృతంగా ఆలయాలు నిర్మించారట.అయితే ఏనుగు విషయం గుర్తుకు వచ్చి చిన్నచిన్న గర్భాలయాలు నిర్మించాడు.
PC: youtube
ఏనుగులు ప్రవేశించలేని గుడిలో, ప్రతిరోజూ ఏనుగుచే పూజలు చేయిస్తున్న ఆలయ అర్చకులు
సుమారు 5ఎకరాల ప్రదేశంలో 5 ప్రాకారాలు,ఏడు ఎత్తైన గోపురాలతో నిర్మితమైన ఈ ఆలయంలో శివుడు అమ్మవారికి జ్ఞానోపదేశం చేసారని అందుకే స్వామి అభిముఖంగా తూర్పుముఖంగా అఖిలాండేశ్వరి అమ్మ వారి ఆలయం వుంటుంది.
PC: youtube
ఏనుగులు ప్రవేశించలేని గుడిలో, ప్రతిరోజూ ఏనుగుచే పూజలు చేయిస్తున్న ఆలయ అర్చకులు
ఇక్కడ శివ పార్వతులకు కళ్యాణం జరిపించరు. ఎందుకంటే వారిని ఇక్కడ గురుశిష్యులుగా భావిస్తారు. స్వామి వారు వెలసిన తొలినాళ్లలో స్థల పురాణం ప్రకారం ఏనుగు పూజలు,అభిషేకం చేసిందని చెబుతున్నారు.
PC: youtube
ఏనుగులు ప్రవేశించలేని గుడిలో, ప్రతిరోజూ ఏనుగుచే పూజలు చేయిస్తున్న ఆలయ అర్చకులు
కాబట్టి ఇప్పటికీ ఆ ఆనవాయితీని ప్రతిరోజూ మధ్యాహ్నం సమయంలో ఆలయ సిబ్బంది క్షేత్రానికి చెందిన ఏనుగును గర్భగుడిలో తీసుకు వచ్చి స్వామివారిని పూలమాలలతో అలంకరించడం చేస్తున్నారు.
PC: youtube
ఎలా వెళ్ళాలి
ట్రిచీ వాయు, రైల్, రోడ్డు మార్గాల ద్వారా దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడి వుంది. చెన్నై, బెంగళూరు, శ్రీలంక, కౌలాలంపూర్ లకు విమానాలు నడిచే తిరుచిరాపల్లి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం.
PC: youtube
ఎలా వెళ్ళాలి
జాతీయ రహదారులు NH 45, 45B, 67, 210, 227 ట్రిచీ గుండా వెళ్తాయి. కనుక ఈ నగరం నుంచి తమిళనాడు లోని ఇతర ప్రధాన నగరాలకు నిత్యం బస్సులు నడుస్తాయి.
PC: youtube
ఎలా వెళ్ళాలి
ట్రిచీ లోని రైల్వే స్టేషన్ తమిళనాడు లోని ప్రధాన జంక్షన్లలో ఒకటి. ఇక్కడి నుంచి భారత దేశంలోని ప్రధాన నగరాలకు నిత్యం రైళ్ళు నడుస్తాయి, అలాగే దక్షిణ భారత దేశంలోని నగరాలకు నేరుగా రైళ్ళు తిరుగుతాయి.
PC: youtube
వాతావరణం
ట్రిచీ లోని వాతావరణం ఏడాదిలో ఎక్కువ కాలం వేడిగా, పొడిగా వుంటుంది. ఇక్కడి వేసవి పగటి పూట చాలా వేడిగా ఉంటూ, సాయంత్రాలు చల్లబడతాయి.
PC: youtube
వాతావరణం
వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు పడి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. ట్రిచీ లోని శీతాకాలం చల్లగా వున్నా, ఆహ్లాదకరంగా వుంటుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వుండే శీతాకాలం నగర సందర్శనకు ఉత్తమ సమయం.
PC: youtube
19. ఇక్కడ సమీప పర్యాటక ప్రదేశాలు
వేలన్ కన్ని, ముక్కొంబు ఆనకట్ట, మలైకోటై ఉచి పిల్లయర్ ఆలయం, సమయపురం మరియమ్మన్ దేవాలయం, సెయింట్ జోసెఫ్స్ చర్చి, సెయింట్ జోసెఫ్స్ చర్చి, గుణశీలం విష్ణు ఆలయం
PC: youtube
ఎలా వెళ్ళాలి
రూట్ మ్యాప్
రూట్ మ్యాప్ - 1
హైదరాబాద్ నుండి బెంగుళూరు,అనంతపురం మీదుగా వెళితే 14 గంటల 30 నిలు పడుతుంది.
రూట్ మ్యాప్ 2
హైదరాబాద్ నుండి విజయవాడ, గూడూరు మీదుగా వెళితే 20గంటల సమయం పడుతుంది. అయితే మీరు ఈ మార్గంలో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చును.
రూట్ మ్యాప్ 3
హైదరాబాద్ నుండి విమానమార్గంలో అయితే 4 గంలలో చేరుతారు.