ఈ కోటలోకి వెళ్ళిన వారు మాయం అయిపోతున్నారు తిరిగి రారు!
హిమాలయాల ఒడిలో కల జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా దానికి గల అందమైన దృశ్యాలకు, ఆహ్లాదకర వాతావరణానికి పేరు గాంచినది. ఈ రాష్ట్రంలో అనేక సైట్ సీయింగ్ ప్రదేశాలు, టూరిస్ట్ కేంద్రాలు, టెంపుల్స్, మొనాస్టరీలు కలవు.
ఐ ఆర్ సి టి సి తో వేసవి కూల్ ..కూల్ గా !
ఈ రాష్ట్రం ఇండియాలో విశ్రాంతి సెలవులకు తప్పక కోరదగినది. ప్రకృతి ప్రియులైనా సరే లేక సాహస క్రీడల పట్ల ఆసక్తి కలవారైనా సరే ఈ ప్రదేశాలను అమితంగా ఇష్టబడతారు.
కాశ్మీర్ సందర్శనలో అద్భుత ప్రదేశాలు !
ప్రసిద్ధ మొఘల్ చక్రవర్తి జహంగీర్, ఈ ప్రదేశ అందాలను చూసి ముగ్ధుడై , ఈ భూమిపై స్వర్గం అనేది వుంటే అది ఇక్కడే కలదని పేర్కొన్నాడు. బ్రహ్మాండమైన పర్వత శ్రేణులు, స్వచ్చమైన నీటి ప్రవాహాలు, అనేక పుణ్య క్షేత్రాలు, మంచు చే ఘనీభవించిన సరస్సులు, అనేక తోటలు, వంటివి ఈ ప్రదేశ అందాలను మరింత పెంచి, తప్పక సందర్శించదగినవిగా చేస్తాయి.
కాశ్మీర్ లో అందాలే కాదు అద్భుతాలు.. దాగున్నాయి !
టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి
జమ్మూ కాశ్మీరు
శ్రీనగర్ నగరం జమ్మూ కాశ్మీరు రాష్ట్రానికి వేసవికాలపు రాజధాని. ఇది కాశ్మీరు లోయలో, జీలం నది ఒడ్డున ఉంది.
జీసస్ ఇండియాలో ఎక్కడికి వచ్చారో తెలుసా ?
కాశ్మీర్ లోయ
ఈ నగరం సరస్సులకు వాటిలో తేలియాడే పడవ ఇళ్ళకు ప్రసిద్ధి. ఇది కాశ్మీర్ లోయ మధ్యభాగంలో ఉంది.
ఇండియాలోని 8 అద్భుత హనీమూన్ ప్రదేశాలు !
జమ్ము కాశ్మీర్ రాష్ట్రం
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో శ్రీ నగర్ జిల్లా రెండవ స్థానంలో ఉంది.
కాశ్మీర్ సందర్శనలో అద్భుత ప్రదేశాలు !
శీతాకాలం
మొదటి స్థానంలో జమ్ము జిల్లా ఉంది. ఇది జమ్ము కాశ్మీర్ రాష్ట్ర వేసవి రాజధానిగా ఉండేది. శీతాకాలంలో రాజధాని జమ్ముకు తరలించబడుతుంది.
గుల్మార్గ్ - తప్పక చూడవలసిన ప్రదేశం !
డాల్ లేక్
అతిపెద్ద నగరమైన శ్రీనగర్లో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం డాల్ లేక్ ఉంది.
సుందరమైన ప్రకృతి మధ్యలో దోడ !!
అందాలకు ఆనవాలం కాశ్మీర్
కాశ్మీర్ లో అందాలే కాదు అద్భుతాలు.. దాగున్నాయి, అందాలకు ఆనవాలం కాశ్మీర్.
చేప కడుపులో ... అండర్ గ్రౌండ్ అక్వేరియం !
రమణీయత
పచ్చని చెట్లు, మనస్సుకు ఆనందాన్ని నింపే ప్రకృతి రమణీయతకు ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే.
మంత్రముగ్ధులను చేసే పహల్గాం పర్యటన !
భూలోకస్వరం కాశ్మీర్
అందుకే మన కవులు కాశ్మీర్ అందాల గురించి ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుంది. అరవిరసిన అందాలతో మనల్ని మంత్రముగ్ధులను చేసే భూలోకస్వరం కాశ్మీర్ మన దేశంలోని అత్యంత అందమైన ప్రాంతాలలో కాశ్మీర్ ఒకటి.
ఆధ్యాత్మిక అనుభవం
భూలోక స్వర్గంగా కాశ్మీర్ ను వర్ణిస్తారు. కాశ్మీర్ ను సందర్శించిన తర్వాత అదొక ఆధ్యాత్మిక అనుభవం కలుగుతుందని సాధారణంగా చాలామంది చెప్తూవుంటారు. ఇది వాస్తవమే ఎందుకంటే అక్కడ అనేకమంది పవిత్రమైన వ్యక్తులున్నారు.
సినిమా షూటింగ్
ప్రకృతిని అత్యంత అందంగా చూసే ప్రాంతం కాశ్మీర్ కావడంతో ఇక్కడ ఎక్కువగా సినిమా షూటింగ్ లు జరుగుతూ వుంటాయి. టూరిస్ట్ ప్లేస్ కావడంతో కాశ్మీర్ ను సందర్శించే వారి సంఖ్య కూడా ఎక్కువే.
కాశ్మీరీయులు
ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా ఈ కాశ్మీర్ అందాలను కనీసం జీవితంలో ఒక్కసారైనా చూడాలని భావిస్తారు. కులమతాలకు అతీతంగా కాశ్మీరీయులు అందరికీ సహాయం చేస్తూ వుంటారు.
చెప్పుకోదగ్గ అందాలు
వచ్చిన అతిధులను చాలా ఆప్యాయంగా చూసుకుంటారు. ఇక్కడ పూలు, పర్వతాలు, నదులు, లేక్స్ చెప్పుకోదగ్గ అందాలు.
సర్ ప్రైజింగ్ ఫ్యాక్ట్స్
ఈ అందాలను చూస్తే జీవితంలో ఎప్పటికీ మరిచిపోని ఒక అద్భుతంగా మిగిలిపోతుంది. ఈ అందాలే కాదు కాశ్మీర్ గురించి 'సర్ ప్రైజింగ్ ఫ్యాక్ట్స్' కూడా వున్నాయి.
రెండు రాజధానులు
కాశ్మీర్ కి రెండు రాజదానులున్నాయి. సమ్మర్ లో శ్రీనగర్ రాజధాని అయితే వింటర్ లో జమ్మూ రాజధానిగా వుంటుంది.
అందరూ చదువుకున్న వాళ్ళే
కాశ్మీర్ ఎక్కువగా అందరూ చదువుకున్న వాళ్ళే ఎక్కువ. ఇక్కడ అక్షరాస్యత శాతం చాలా ఎక్కువగా వుంటుంది. కాశ్మీర్ జనాభా 16మిలియన్లు.ప్రపంచంలోని 133ఆయా ప్రాంతాలలోని జనాభా కంటే ఎక్కువ.
భూమి కొనే ఛాన్సే లేదు
ఆర్టికల్ 370,ఈ ఆర్టికల్ ప్రకారం కాశ్మీర్ లో ఇతర ప్రాంతాల వాళ్ళు భూమి కొనటానికి వీల్లేదు. జమ్మూ కాశ్మీర్ కి చెందని ఏ ఒక్కరూ ఇక్కడ భూమి కొనే ఛాన్సే లేదు.
సిటిజెన్ షిప్
జమ్మూ కాశ్మీర్ కి చెందిన ఏ మహిళైనా ఇండియాలోని ఇతర ప్రాంతాలలో లేదా వేరే దేశాలలో సిటిజెన్ షిప్ కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకోటానికి వీలులేదు. ఒక వేళ అలా చేసుకుంటే ఆమెకున్న కాశ్మీర్ సిటిజెన్ షిప్ కేన్సిల్ అవుతుంది. శ్రీనగర్ ను సిటీ ఆఫ్ లక్ష్మీగా పిలుస్తారు.
౩౦౦౦ల సంవత్సరాల క్రితం
ఈ అందమైన ప్రాంతాన్ని అశోకుడు కనిపెట్టాడు. జమ్మూని ౩౦౦౦ల సంవత్సరాల క్రితం గుర్తించారు. కాశ్మీర్ లో ముస్లింలు ఎక్కువగా వుంటే, జమ్మూలో హిందువులెక్కువగా వుంటారు. అలాగే లడఖ్లో బుద్ధిస్టులెక్కువగా వుంటారు.
కె. ఎల్ సైగల్
లెజండ్రీ సింగర్, ఇండియాలో ఫస్ట్ సూపర్ స్టార్ కెఎల్ సైగల్ జమ్మూ అండ్ కాశ్మీర్ కి చెందినవారే. జమ్మూ కాశ్మీర్ కు చైనా, పాకిస్థాన్ రెండూ బార్డర్ దేశాలే. రెండు అంతర్జాతీయ దేశాల బార్డర్స్ కలిగిన భారతీయ రాష్ట్రంగా కాశ్మీర్ ను చెప్పుకోవచ్చును.
ఎలా చేరాలి ?
శ్రీనగర్ మరియు లెహ్ లకు విమాన సేవలు కలవు. ఈ ప్రదేశంలో భద్రత ఏర్పాట్లు అధికం కనుక రోడ్ ప్రయాణం సూచించదగినది. జమ్మూలోని రైలు స్టేషన్ దేశం లోని ఇతర ప్రధాన రైలు ప్రాంతాలకు కలుపబడి వుంది. భద్రతా కారణాల దృష్ట్యా ట్రైన్ లు పరిమితంగా ఉంటాయి. అయితే ఇక్కడకు చేరిన తర్వాత టాక్సీ లేదా కాబ్ లలో అన్ని ప్రదేశాలకు విహరించవచ్చు.
- సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళిన గుహ రహస్యం తెలుసా ?
- ఇండియాలో రాబోతున్న టాప్ 6 మెగా టెంపుల్స్ ఏవేవో తెలుసా?
- మీలో ఎంతమందికి హిమాలయాలలోని మిస్టరీ మనిషి గురించి తెలుసు ?