ఔరంగజేబు మొఘల్ రాజైన షాజహాన్ కుమారుడు. ఇతడు క్రీ.శ.1650నుండి 1707వరకు డిల్లీని రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని పరిపాలించాడు.చాలా తెలివైన వాడు.కానీ వివాదాస్పదుడు.తను అనుకున్నది సాధించడానికి ఎంతటి క్రూరానికైన సిద్ధపడేవాడు.అతడి జీవితకాలంలో అనేక క్రూరమైన పనులు ఎన్నో చేసాడు.
అందులో మచ్చుకు కొన్ని.ఔరంగజేబు చక్రవర్తి అయ్యాడని తెలిసి అతడికి విద్యాబుద్ధులు నేర్పిన మూల్లాషా అనే గురువు తనకు ఏదైనా బహుమతి లభిస్తుందనే వుద్దేశంతో ఔరంగజేబు దగ్గరికి వస్తాడు.3నెలలు అతడ్ని చూసీచూడనట్టు వ్యవహరించిన ఔరంగజేబు ఒక రోజు గురువును దర్బారుకు పిలిపించి చడామడా తిట్టాడు.
నువ్వు నాకేమైనా పనికొచ్చే చదువు చెప్పావా? ఎదుటి రాజ్యాల గురించి నువ్వనీతప్పులే చెప్పావు.నాకు అరబిక్ భాష తప్ప ఇంకో భాష నేరావా?పనికిరాని గ్రామర్లు నేర్పావు.ఏదోఒకనాటికి ణా సోదరులతో యుద్ధం చేయాల్సివస్తుందన్న విషయం నాకు నేర్పావా? అదృష్టం కొద్ది నీకంటే తెలివైనవారిని సంప్రదించాను.కాబట్టి బతికిపోయాను.ఏం వుద్దరించావని నిన్ను సన్మానించాలి.పోపో నువ్వు ఎవరో ఏమైపోయావో కూడా నాకు తెలియకూడదు అని అంటాడు.
మొఘల్ రాజులు మన దేశంలో అడుగుపెట్టాక అనేక హిందూ రాజ్యాలను ధ్వంసం చేసారు. పేరు మోసిన అనేక కళాఖండాలను నామరూపాల్లేకుండా చేసారు.హిందూసంస్క్రుతిని పెంచిపోషించిన వారిలో హీరో లాంటి వాడు అక్బర్ అయితే మోస్ట్ విలన్ గా పెరుమోసింది ఔరంగజేబు.
అవును అతని కన్ను పడని ఆలయం లేదు.ధ్వంసం కాని చరిత్ర లేదు ఒకటి తప్ప.ఔరంగజేబు అన్ని ఆలయాలను ధ్వంసం చేసినట్టే కైలాస టెంపుల్ ను కూడా నామరూపాలు లేకుండా చేద్దామనుకున్నాడు.కానీ ఇటుక మందం కూడా చెక్కుచెదర్చ లేకపోయాడు.కానీ ఆ కైలాస టెంపుల్ ఎక్కడుందో తెలుసా? దాన్ని ఔరంగజేబు ఎందుకు తాకలేకపోయాడో తెలుసా?
ఔరంగజేబును వణికించిన ఆలయం ఇది
ఎక్కడుంది?
కైలాస టెంపుల్ మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో వుంది.
గుహ అంటే
గుహ అంటే ఈ టెంపుల్ బయటకు కనపడదని కాదు.నిక్షేపంగా కనిపిస్తుంది.ఇది ఇటుకలతోనో,పెద్దపెద్ద రాళ్ళు పేర్చో కట్టిన కట్టడం కాదు.
4 లక్షల టన్నుల రాతి
పూర్తిగా ఒక తొండను తొలచి నిర్మించిన ఆలయం.మొత్తం 4 లక్షల టన్నుల రాతిని తొలిస్తే ఆ ఆలయానికి ఒక ఆకారం వచ్చింది.
ఒక రూపు తీసుకురావాలంటే
అంత పెద్ద మొత్తంలో రాయిని చెక్కి ఒక రూపు తీసుకురావాలంటే అప్పటిరోజులనుబట్టి కనీసం 200సంలు కావాలి.
కానీ ఈ టెంపుల్ ని నిర్మించటానికి తీసుకున్న టైం ఎంతో తెలుసా?
కేవలం 18సంలు. 18ఏళ్ళపాటు నాలుగు లక్షల టన్నుల రాయిని తొలచి కైలాస్ టెంపుల్ కట్టారు.
4లక్షల టన్నులంటే ఎంత?
4లక్షల టన్నులంటే ఏడాదికి 22,222టన్నుల రాయి.అంటే రోజుకు 60టన్నులు.రోజులో 12గంటలపాటు పని చేసారనుకున్నా గంటకు 5టన్నుల రాయిని పెకిలించాలి.అది కూడా అడ్డదిడ్డంగా కాదు.
ఔరంగజేబును వణికించిన ఆలయం ఇది
ఆలయానికి కావలసిన షేప్లో చెక్కుతూ అంతరాయిని తీసేయాలి.ఇప్పుడున్న అంత అత్యాధునిక మిషనరీలు వాడినా గంటలో 5టన్నుల రాయిని పెకిలించటం అసాధ్యం.
మహారాష్ట్రలోని అద్భుతమైన కైలాసదేవాలయం
మరి అలాంటివాళ్ళు ఇంత ఘనకార్యాన్ని ఎలా సాధించారో వారికే తెలియాలి. ఆకాశం నుంచి చూస్తే ఈ టెంపుల్ ఎక్స్ షేప్ లో వుంటుంది.భూమి మీద నుండి చూస్తే 4 సింహాలు xఆకారంలో నిలుచున్నట్లు కనిపిస్తుంది.
మహారాష్ట్రలోని అద్భుతమైన కైలాసదేవాలయం
అంతేకాదు ఈ ఆలయనిర్మాణంలోనే వాటర్ హార్వెస్టింగ్ సౌకర్యం వుంది.ఎక్కడికక్కడ డ్రైనేజ్, రహస్యమార్గాలు, బాల్కానీలు, అప్స్టైర్స్ ఎన్నో అద్భుతాలు వున్నాయి.అన్ని కూడా రాయితో అన్నికూడా రాయితో చెక్కింది.
మహారాష్ట్రలోని అద్భుతమైన కైలాసదేవాలయం
1680లో ఔరంగజేబు కైలాసాలయాన్ని ధ్వంసం చేయాలని ప్లాన్ వేసాడు.1000మంది పనివాళ్ళనిపెట్టాడు.3ఏళ్ళు దాన్ని కూల్చటానికి కష్టపడ్డాడు.కానీ అడ్డంగా ఫెయిలయ్యాడు.
మహారాష్ట్రలోని అద్భుతమైన కైలాసదేవాలయం
అన్నేళ్లల్లో వాళ్ళు చేసింది కేవలం కొన్ని విగ్రహాలకు గాట్ లు పెట్టడమే.;అంతకు మించి ఏమీ చేయలేకపోయాడు.ఏంవింతో గానీ కనీసం ఆలయంలోని గర్భ గుడిలోకూడా వెళ్ళలేకపోయాడు.
మహారాష్ట్రలోని అద్భుతమైన కైలాసదేవాలయం
ఈ వింతను చూస్తూనే మూడేళ్ళు పంతంతో కష్టపడ్డాడు ఔరంగజేబు కానీ ఏమీచేయలేని నిస్సహాస్థితిలో తన ఓటమిని అంగీకరించి వెనుదిరిగాడు.అందుకే ఎల్లోరాకేవ్స్ తో పాటు ఈ ఆలయం కూడా వరల్డ్ హిస్టరీ.
మహారాష్ట్రలోని అద్భుతమైన కైలాసదేవాలయం
ఔరంగజేబ్ అనేక హిందుఆలయాలను నాశనం చేసాడు. ఆ క్రమంలో భాగంగా ఈ ఆలయాలను కూడా నాశనం చేయాలని వెయ్యిమందిని పంపించాడు.
PC:youtube
మహారాష్ట్రలోని అద్భుతమైన కైలాసదేవాలయం
వారు విశ్రాంతి లేకుండా 3సంల పాటు ఎంతో ప్రయత్నించినప్పటికీకొంత మేరకు కొన్ని శిల్పాలను మాత్రమే నాశనం చేయగలిగారు తప్ప ఆలయాలను ఏమీ చేయలేకపోయారు.
PC:youtube
మహారాష్ట్రలోని అద్భుతమైన కైలాసదేవాలయం
మరి ఇంత అద్భుతమైన ఆలయాన్ని ఎవరు కట్టారో.ఎలా కట్టారో తెలియదు. ఆ అద్భుతం వెనకవున్న రహస్యం ఏంటో ఇప్పటికీ అర్ధంకాలేదు.
PC:youtube
మహారాష్ట్రలోని అద్భుతమైన కైలాసదేవాలయం
మరి మానవుడు ఈ ఆలయాన్ని నిర్మించాలన్నా,నాశనం చేయాలన్నా ఇప్పట్లో సాధ్యంకాదేమో.అజంతాఎల్లోరా గుహలు ఈ గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో అజంతా అనే గ్రామానికి సమీపంలో వున్నాయి.
PC:youtube
మహారాష్ట్రలోని అద్భుతమైన కైలాసదేవాలయం
అజంతాఎల్లోరా గుహలు బౌద్ధుల కాలంలో ఏర్పడివుండవచ్చని దాదాపు 30వరకు వున్న ఈ గుహలను రాతి కొండలలో తొలిచారు.ఈ గుహలను యునెస్కో వారిచే ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించారు.
PC:youtube
మహారాష్ట్రలోని అద్భుతమైన కైలాసదేవాలయం
గుర్రపునాడా ఆకారంలో వున్న కొండపై 56 మీ ల ఎత్తైన పర్వతాలలో ఈ గుహలను తొలచడమనేది జరిగింది.ఈ గుహల విస్తీర్ణం 2కి.మీ.మరి మొత్తం గుహలను నిర్మించటానికి దాదాపు 500సంలు పట్టి వుండవచ్చని భావిస్తారు. 29వ గుహ దగ్గర పైనుండి జాలువారే జలపాతం దీనినే దారాతీర్ధం అంటారు.
PC:youtube
మహారాష్ట్రలోని అద్భుతమైన కైలాసదేవాలయం
ఎల్లోరాను దర్శించడానికి ఆగస్టు-అక్టోబరు మధ్య కాలం అనువైనది. కాని విద్యార్థులకు వేసవి సెలవుల కారణంగా మే-జూన్ నెలలలో పర్యాటకులు అధికంగా వస్తారు.
PC:youtube
ఎలా వెళ్ళాలి
రైలు ద్వారా ఔరంగా బాద్ కు చేరుకుని, అక్కడి నుండి బస్సులో కానీ, కార్లు, జీపులలో కాని ఎల్లోరా గుహలకు చేరుకోవచ్చు.
హైదరాబాద్ నుండి ఎల్లోరా గుహలకు వెళ్ళటానికి నాందేడ్ మీదుగానయితే 11గంల 23ని లు పడుతుంది.
PC: google maps