కర్ణాటకలో చనిపోయిన యువకుడు మరలా లేచి కూర్చున్నాడు
భారతదేశంలో ఒకేఒక భూతాలను వదలగొట్టే దేవాలయం ఏదంటే పవిత్రమైన శ్రీ మెహందిపుర్ బాలాజీ దేవాలయం. ఈ ఆలయం బాలాజీ అని కూడా పిలువబడే హనుమంతుడికి అంకితం చేయబడింది.
ఈ దేవస్థానం రాజస్థాన్ లో దౌసా జిల్లాలో వున్నది. ధైర్యముండేవాళ్ళు ఈ దేవాలయాన్ని ఒక్కసారి వెళ్లి చూసిరావచ్చును. స్వామి దర్శనం మరియు దుష్ట శక్తులను వదలుగొట్టుకునే దానికి వందలాది మంది భక్తులు ప్రతిరోజూ ఈ ఆలయానికి వస్తారు.
ఇక్కడ గల ఆంజనేయస్వామి మహా మహిమ గలిగిన దేవుడు. ఇక్కడ బాలాజీ స్వామే స్వయంగా భూతవైద్యం చేసే ఆశ్చర్యకరమైన దృశ్యాలు చూడవచ్చును. ఈ దేవాలయం గురించి దేశ, విదేశీ శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేసారు.
ప్రస్తుత వ్యాసంలో బాలాజీ స్వామి యొక్క మహిమ గురించి తెలుసుకుందాం.
టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి
1. దేవాలయం ఎక్కడ వుంది?
ఈ మహిమాన్విత దేవాలయం పవిత్రమైన హిందు దేవాలయం. రాజస్థాన్ లో దౌసా జిల్లా నందు బాలాజీ దేవాలయం నందు హనుమంతుడు దివ్యంగా వెలుగొందుతున్నాడు.హనుమంతుని దేవాలయాలు భారతదేశంలో చాలా చోట్ల మనం చూడవచ్చు.కానీ ఈ దేవాలయంలో వున్న స్వామి భూతాలను తరిమికొట్టే శక్తి కలిగిన దేవతామూర్తి.
PC:Seoduniya,pramod kumar gupta
2. భూతాలను తరిమికొట్టడం
ఈ దేవాలయానికి వచ్చే చాలామంది దుష్టశక్తుల వల్ల బాధపడుతుంటారు. ఈ స్వామి దుష్టశక్తులను పారద్రోలుతారు.
3. భక్తులు
ఈ దేవాలయానికి ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు వస్తారు. రాజస్థాన్ లో వుండే వారే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ దేవస్థానానికి వస్తారు.జాతి,మత భేదాలు లేకుండా అందరూ ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు.
PC:YOUTUBE
4. పర్వతం
ఈ దేవాలయం ఒక సామాన్య గ్రామంలో ఒక పర్వతం మీద స్వామి కొలువైవున్నాడు. ఈ గ్రామం అంత బాగా అభివృద్ది చెందకపోయిన బాలాజీ దేవాలయం మాత్రం ప్రఖ్యాతి గాంచినది. ఈ పర్వతం మీద వేలాది భక్తులు దర్శించుకొనుట చూడవచ్చును.
PC:YOUTUBE
5. ధైర్యం వుంటే మాత్రం
ఈ దేవాలయంలో కొంతమంది భూతాలను వదలగొట్టించుకొనేందుకు వస్తారు గనక అనేక విధాలైన అరుపులు మనకు వినపడతాయి. అందుకని కొంతమంది భక్తులు భయభ్రాంతులకు గురి అవుతారు.
ధైర్యంగలవారు మాత్రమే ఈ స్థలాన్ని సందర్శించవచ్చు.
PC:YOUTUBE
6. గర్భగుడిలోని ప్రధాన అర్చకులు
ఈ బాలాజీ దేవాలయంలో ఇద్దరు ప్రముఖ అర్చకులు వున్నారు. ఇంతకు ముందు ముఖ్య అర్చకులు గణేష్ పుర్జీ మహారాజ్ వుండేవారు. ప్రస్తుతం ప్రధాన అర్చకులు శ్రీ కిషోర్ పుర్జీ మహారాజ్ వున్నారు. ఈ ఇద్దరు పూజారులు బ్రాహ్మణులు.అత్యంత భక్తితో,నిష్ఠతో మాంసాహారం ముట్టని పవిత్రమైన గ్రంథాలు చదివే బ్రాహ్మణులు అయివున్నారు.
PC:YOUTUBE
7. శ్రీరాముని దేవాలయం
బాలాజీ దేవాలయం ముందు భాగంలో హనుమంతుని ప్రియమైన శ్రీరాముని దేవాలయం వుంది. ఈ దేవాలయంలో అత్యంత సుందరమైన శ్రీరాముని దర్శించుకోవచ్చు.
PC:YOUTUBE
8. కానుకలు
భూతాలను నిర్మూలన చేసుకునే భక్తులు బాలాజీకి ఆరోజీ, స్వామణి, ధరకష్ట్, బుంది అను కానుకలు అర్పిస్తారు. ఆలయం లోపలి భాగంలో భైరవ బాబాను దర్శించుకోవచ్చును. ఇతనికి అన్నాన్ని కానుకగా సమర్పిస్తారు.
PC:YOUTUBE
9 .ముఖ్యమైన రోజులు
ఈ బాలాజీ దేవాలయంలో దెయ్యాలను వదలగొట్టే రోజులు శనివారం మరియు మంగళవారం. ఈ రెండు రోజులలో తండోపతండాలుగా జనం తరలివస్తారు.
PC:YOUTUBE
10. ఇక్కడికి సమీపంలో వున్న దేవాలయాలు
బాలాజీ దేవాలయానికి దగ్గరలో అనేక దేవాలయాలను చూడొచ్చు.అవి అంజనామాతా దేవాలయం,కాళీ మఠం, పంచముఖి హనుమాన్ జీ దేవాలయం, సమాదివాలే బాబా.ఈ పవిత్రమైన దేవాలయాలన్నీ మెహందిపుర్ లో చూడవచ్చును.
PC:YOUTUBE
11. పరిశోధనలు
ఈ దేవాలయం మెహందిపుర్ లో అత్యంత పురాతనమైన దేవాలయం. ఇక్కడ జరిగే భోతోద్ఘటన గురించి 2013లో జర్మన్, నెదర్లాండ్స్, న్యూఢిల్లీ శాస్త్రవేత్తల బృందం పరిశోధించారు.
PC:YOUTUBE
12. భక్తుల యొక్క మడి ఆచారాలు
ఈ ఆలయానికి వచ్చే భక్తులు మాంసం మరియు మద్యం సేవించకూడదు.
PC:YOUTUBE
13.భూతవైద్యం
భూతవైద్యం సమయంలో దుష్టశక్తులతో బాధపడేవారిని ఆలయంలోని ప్రత్యేక స్థలంలో ఒంటరిగా వదిలివేయాలి.
PC:YOUTUBE
14. ప్రసాదం
ఇక్కడ తీసుకున్న ప్రసాదాన్ని ఇక్కడే తినేయాలి. ఇంటికి తీసుకుని వెళ్ళకూడదు. ఒకవేళ అలా తీసుకువెళ్తే కీడు సంభవిస్తుందని భక్తుల అభిప్రాయం.
PC:YOUTUBE
15. దేవాలయం తెరచువేళలు
ఈ దేవాలయం వారంలో అన్ని రోజులు తెరచి వుంటుంది. ఉదయం 6 గంల నుంచి రాత్రి 9 గంల వరకు దర్శనం చేసుకోవచ్చును.
PC:YOUTUBE
- నల్లమల కొండ గుహల్లో మీకు తెలియని రహస్యాలు !
- గోదావరి తీరాన ఆదిమానవుల జాడలు !
- గోవా గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు !