కర్ణాటక రాష్ట్రంలోని దేవనాగరి జిల్లాలో వున్న పంచాయత్ అనే పట్టణానికి దగ్గరగా వున్న సంతిబన్నూర్ ప్రాంతానికి సమీపంలో నాగినహళ్లి అనే ఒక గ్రామం వుంది. దేవనాగరి పట్టణానికి సరిగ్గా 50మీ దూరంలో ఈ పట్టణం వుంది. సర్పాల యొక్క మహత్యం కారణంగా ఈ గ్రామం చాలా కాలంగా వార్తల్లోకొస్తుంది. ఈ గ్రామంలో వున్న విశేషం ఏమిటంటే ఈ గ్రామంలో వున్న వారు గానీ,ఈ గ్రామానికి వచ్చిన వారు గానీ ఏవిధమైన సర్పకాటుకి గురికావటం లేదు.ఈ గ్రామంలో ప్రతి ఇంట్లోనూ త్రాచుపాములు సంచరిస్తూ వుంటాయి.
మురుడేశ్వర్ శివ ... విశిష్ట దైవత్వం !
అయినప్పటికీ ఈ గ్రామంలో ఎవ్వరూ త్రాచుపాములను చూసి ఎంతమాత్రం భయపడరు. అసలు నాగినహళ్లి అంటేనే త్రాచుపాముల గ్రామం అని అర్ధం. త్రాచుపాములు మానవులతో కలిసి సహజీవనం చేస్తూ ద్రిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయ్. ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ ప్రాంతంలోని అనేక మంది ప్రజలు చాలాసార్లు కొన్నికారణాల వల్ల సర్పాల వల్ల కాటుకు గురైన వాళ్లకు ఏమీ కాలేదు. సర్పం చేత కరవబడ్డ వారు ఆ గ్రామంలో ఉన్నంతవరకు వాళ్లకు ఏమీ కాదు.
కొత్త జంటలకు విహార కేంద్రం ... కూర్గ్ !!
ఈ కారణం చేతనైనా పాముకాటుకు గురైనవారు ఆ వూరు పొలిమేరల్ని దాటి మరుక్షణం చచ్చి క్రింద పడిపోతారు. అంటే పాము కరిచినప్పటికీ ఆ గ్రామంలో ఉన్నంతవరకు వాళ్ళ మీద ఆ పాము విషం పనిచేయదన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుందో కొమ్ములు తిరిగిన సర్పశాస్త్రఘ్నులకు కూడా అర్ధం కాలేదు. ఆ క్రమంలో ఎవరైనా ఒక సర్పం కరిస్తే వాళ్ళు ఆ సర్పాన్ని తీసికెళ్ళి ఆ వూరి స్మశానంలో వున్న యతీశ్వరస్వామి మంటపం దగ్గర వుంచుతారు. ఆ గ్రామంలో సర్పాల చేత కరవబడ్డవారు మొదట దగ్గరలో వున్న హనుమాన్ ఆలయానికి వెళతారు.
ఈ గ్రామంలో పాము కరిచినా ప్రాణం పోదు? సైన్స్ కి అంతుచిక్కని రహస్యం !
టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి
1. ఆంజనేయస్వామి భక్తుడు
అక్కడ స్వామివారి తీర్థాన్ని తీసుకుని మర్నాడు ఉదయం వరకు ఆ గుడిలోనే వుండిపోటారు. అంతే ఎక్కినా త్రాచుపాము విషం నిర్వీర్యం అయిపోయి వాళ్ళు క్షేమంగా భయటపడతారు. ఒకప్పుడు ఈ గ్రామంలో యతీశ్వరస్వామి అనే సాధువు, ఆంజనేయస్వామి భక్తుడిగా వుండేవాడట. ఆయన ప్రతీరోజు ఉదయం గ్రామంలోని ఇంటింటికి తిరిగి బిచ్చం ఎత్తుకొని ఆ పై హనుమాన్ గుడి పరిసరాలలో విశ్రాంతి తీసుకునేవాడట. ఒక రోజు ఆయన ఇంటింటికి వెళ్లి బిచ్చం ఎత్తుకుంటుండగా పొదల మధ్యలో పడివున్న ఒక శిశువు కనిపించింది.
హంపి దేవాలయంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు !
PC:youtube
2. మగబిడ్డ
అది ఒక మగబిడ్డ అనాధిగా పడివున్న ఆ బిడ్డను చూసి ఆ సాధువు హృదయం కరిగిపోయింది. ఫలితంగా ఆయన ఆ బిడ్డను తనతో పాటుగా తీసుకువెళ్ళి పెంచటం ప్రారంభించాడు. కాలచక్రంలో 12సం.లు గడిచిపోయాయ్. ఆ మగబిడ్డకు 12ఏళ్ళు నిండాయి. ఒకరోజున ఆయన ఆ పిల్లవాడిని గుడివద్ద వుంచి బిచ్చమెత్తుకోవడానికి ఊరిలోకెళ్ళాడు.మధ్యాహ్నానికి బిచ్చం తీసుకుని గుడి దగ్గరకొచ్చిన సాధువుకి పాముకాటుకి గురై చనిపోయివున్న తన పెంపుడు బిడ్డ కనిపించాడు.
ప్రకృతి రమణీయ సౌందర్యాలు వెల్లివిరిసే అన్నపూర్ణేశ్వరీ దేవి ఆలయం
PC:youtube
3. సాధువు
తన పెంపుడు బిడ్డకు అకాలమృత్యువు కలిపించిన ఆ సర్పం పైన ఆ సాధువుకు విపరీతమైన ఆగ్రహం కలిగింది. అమోఘమైన తపఃశ్శక్తి కలిగిన ఆ సాధువు ఆగ్రహంతో నాగలోకాన్ని పరిపాలించే నాగారాజుని శపించటానికి ప్రయత్నించాడు. ఆ విషయాన్ని పసిగట్టిన నాగరాజు కన్నుమూసి తెరిచేలోగా తన పరివారంతో సహా పాతాళలోకం నుండి ఆ సాధువున్న ప్రాంతానికి వచ్చి శపించబోతున్న ఆ సాధువు కాళ్ళమీద పడి జాతి పాము చేసిన పాపాన్ని క్షమించమని వేడుకున్నాడు.
జి ఆర్ ఎస్ ఫాంటసీ పార్క్ లో సమ్మర్ థ్రిల్ రైడ్స్ !
PC:youtube
4. సాధువు శాంతించి
అంతేగాకుండా సర్పం కాటుకి గురై చనిపోయిన బాలుని వెంటనే బ్రతికించాడు. అప్పుడు ఆ సాధువు శాంతించి నాగరాజుతో ఇలా అన్నాడు. ఇకపై ఈ గ్రామంలో నివశించేవారిని, ఉన్నవారిని ఏ సర్పమైతే కరిచినట్లయితేకరవబడ్డవారు ఈ గ్రామం దాటనంతవరకు వారిలో వున్న పాము విషం శక్తిహీనమౌతుంది.
PC:youtube
5. నాగినహళ్లి గ్రామం
అందువలన వారు చావరు. ఏ కారణంగానైనా పాము కాటుకు గురైనవాళ్ళు ఈ గ్రామం పొలిమేరులు దాటినా మరుక్షణం చనిపోతారు. నాగరాజు సాధువు చెప్పిన షరతుకు అంగీకరించాడు. ఆ తరువాత ఆ సాధువు ఆ గ్రామానికి 4సరిహద్దులలో నాలుగు బండరాళ్ళను నాటి వాటిపై ఆయనే స్వయంగా ఇలా చెక్కాడు. ఈ నాలుగు రాళ్ళ సరిహద్దుల లోపల వుండే నాగినహళ్లి గ్రామంలో ఉన్నంతవరకు సర్పం చేత కరవబడ్డ ఏ వ్యక్తీ ప్రాణహాని వుండదు. సర్పం కరచిన వ్యక్తి వెంటనే గ్రామ పొలిమేరలు దాటిపోయినట్టయితే వారికి మరణం తప్పదు.
PC:youtube
6. యతీశ్వరస్వామి
ఈ నాటికీ ఆనాడు యతీశ్వరస్వామి చేత భూమిలో స్థాపించబడ్డ నాలుగు సరిహద్దు బండరాళ్ళు యధాతధంగా నిలిచే వున్నాయ్. అయితే ఆ యతీశ్వరస్వామి ఏ శతాబ్దానికి చెందినవాడో తెలియటంలేదు. ఈ గ్రామంలోని ప్రజలు మాంసాహారం తినకూడదని, సర్పాలను చంపకూడదని ఒక నియమాన్ని ఆ సాధువు ఏర్పాటుచేశాడు.
PC:youtube
7. సాధువు
తెలిసికానీ తెలియకకానీ ఈ గ్రామంలోని వారు ఏదైనా సర్పాలను చంపినట్లయితే తీవ్ర ఫలితాలను ఎదుర్కోవలసి వుంటుందని ఆ సాధువు తెలియజేసాడు. ఆ సాధువు కదా తరతరాలుగా ఒకళ్ళ నుండి ఇంకొకళ్ళకి అందుతూవుంది. ఆ గ్రామంలో దాదాపు 70ఇళ్లుంటాయ్. ఆ గ్రామంలోని ఇళ్ళవెంట తోటల్లోనూ,పోదల్లోనూ భారీ పరిమాణంలో వుండే త్రాచుపాములు నిరాటంకంగా సంచారిస్తూవున్నా వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతూ వుంటారు ఆ నాగినహళ్లి గ్రామస్థులు.
భారతదేశంలో సంగీత స్తంభాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా ?
PC:youtube
- ఈ గుడికి వెళ్ళాలంటే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే !
- తలక్రిందులుగా పడే ఆలయ శిఖరం నీడ ఎక్కడ ఉంది ?
- వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే !