శ్రీరాముడు రావణుడుని చంపి బ్రాహ్మణహత్య చేసాననే దిగులుతో పాప పరిహార నిమిత్తం ఎన్నో చోట్ల శివలింగాలకి ప్రాణప్రతిష్ఠ చేసాడు. అలాగే పరశురాముడు కార్త్యవీర్యార్జునితో సైతం ఎంతో మందిని హత్య చేసిన బాధతో ఆయనకూడా క్రౌంచ్య పర్వతం మీద తపస్సు చేసి అక్కడ పూజచేసిన శివ లింగాన్ని ఎక్కడ ప్రతిష్టించాలా అని అనుకుంటూవుండగా శ్రీరాముడు సీతామహాదేవీతో కలిసి గోస్థలీనదీతీరం దగ్గరకి చేరుకోగానే అక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని అనుకున్నది.
ఈ శివుని గుడి విశిష్టత వింటే వెంటనే వెళ్లి దర్శించుకుంటారు !
ఇది కూడా చదవండి: భీమవరంలో మరియు చుట్టుప్రక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు !!
టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి
1. ఇసుక,నత్తలతో
అక్కడున్న ఇసుక,నత్తలతో సీతాదేవి సహాయంతో ఒక శివలింగాన్ని తయారుచేసి ప్రతిష్ట చేసాడు.
pc:youtube
2. నత్తారామలింగేశ్వర స్వామి
ఆ శివలింగాన్ని నత్తారామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు.
pc:youtube
3. గోస్తనీ నదీ తీరంలో
శ్రీరాముడు సీతామహాదేవీ కలసి లింగాన్ని తయారుచేసాక అలాగే పరశురాముడు కూడా తను పూజ చేసిన శివలింగాన్ని తీసుకొచ్చి అదే గోస్తనీ నదీ తీరంలో శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం పక్కనే ప్రతిష్ట చేసాడు.
pc:youtube
4. అగ్నిలింగం
అయితే పరశురాముడు మహాకోపిష్టి కదా.అందుకనే అగ్నిలింగంలా కనపడే సరికి అయ్యో నా అహంకారం ఇంకా తగ్గలేదా అని బాధపడి శివలింగం చుట్టూ ఒక చెరువులా తవ్వి దానిని గోస్తనీనదీ నీటితో నింపేశాడు.
pc:youtube
5. 11నెలలు నీళ్ళతో
స్వామి చల్లబడ్డాక అయ్యో ! స్వామీ నీకు పూజలెలా అని బాధపడుతూంటే అప్పుడు స్వామి బాధపడకు పరశురామా! నేను 11నెలలు నీళ్ళతో వుంటాను.
ఇది కూడా చదవండి:గుంటుపల్లి బౌద్ధారామాలు, పశ్చిమ గోదావరి జిల్లా !!
pc:youtube
6. అభయం
ఒక వైశాఖ మాసంలో అందరికీ కనిపిస్తూవుంటాను అని అభయమిచ్చాడు.
pc:youtube
7. గోస్తనీ నదీతీరం
శ్రీరాముడు కూడా గోస్తనీ నదీతీరంలో శివలింగాన్ని ప్రతిష్టించాడు.
pc:youtube
పురాణకథనం
ఈ శివలింగాన్ని పరశురామలింగేశ్వరస్వామి అని అంటారని పురాణకథనం.
pc:youtube
9. నత్తా రామలింగేశ్వరం
ఇలా రెండు శివలింగాలు,ఒకే ప్రాంగణంలో వున్న దేశం పశ్చిమగోదావరి జిల్లా పెనుమండ్రమండలంలోని నత్తారామలింగేశ్వరంలో వుంది.
ఇది కూడా చదవండి:క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం, పాలకొల్లు !!
pc:youtube
10.తప్పక చూడవలసిన క్షేత్రం నత్తా రామలింగేశ్వరక్షేత్రం.
తాడేపల్లిగూడెం నుండి 20కి.మీ ల దూరం. ఒక శివలింగం నీటిలోనూ, ఒక శివలింగం గర్భగుడిలోనూ కనిపిస్తూవుంటాయి.తప్పక చూడవలసిన క్షేత్రం నత్తా రామలింగేశ్వరక్షేత్రం.
pc:youtube
- ఈ గుడికి వెళ్ళాలంటే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే !
- తలక్రిందులుగా పడే ఆలయ శిఖరం నీడ ఎక్కడ ఉంది ?
- వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే !