పాలితానా నగరం భారత దేశం లోని గుజరాత్లో గల "భావ్నగర్ జిల్లా" లోనిది. ఇది భావ్నగర్ పట్టణానికి నైరుతి దిక్కున ఉంది. ఇది జైనుల యొక్క తీర్థయాత్రా ప్రదేశము. గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలో అతి పురాతన పట్టణం 'పాలితానా'. ఇక్కడికి అతి సమీపంలోని శత్రుంజయ పర్వతాలు జైనుల పంచక్షేత్రాలలో ఒకటి.
ఇది కూడా చదవండి : సూరత్ పర్యాటక ప్రదేశాలు !!
ఈ ప్రాంతంలో మొత్తం 863 ఆలయాలు ఉండటం విశేషం. అన్నిట్లో ముఖ్యమైనది ఆదీశ్వరాలయం. పాలరాతితో నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. చాలా దేవాలయాలు ఇక్కడ జైన మందిరాలుగా మార్పు చెందాయి. 11వ శతాబ్దం నాటి ఇక్కడి ఆలయాల్లో శిల్ప నైపుణ్యం అద్భుతం. ఈ ప్రాంతంలో అనేక బౌద్ధ గుహలు కన్పిస్తాయి. అప్పట్లో జైన, బౌద్ధమతాలు గొప్పగా విరాజిల్లిన ప్రాంతం పాలితానా.
తీర్థయాత్రా స్థలం
ప్రపంచంలో 900 ఆలయాలు ఒకే దగ్గర ఉన్న ఒకే ఒక పర్వతం పాలితానా. జైన మతంలో పాలిటానా దేవాలయాలు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రా స్థలంగా కొనియాడబదుతున్నవి.
చిత్రకృప : Bernard Gagnon
శత్రుంజయ కొండ
ఈ ప్రాంతంలో అద్భుతంగా పాలరాతితో చెక్కిన 3000 ఆలయాలు శత్రుంజయ కొండపై ఉన్నాయి. ఆ ఆలయాలలో ప్రధాన ఆలయం జైన తీర్థంకరులలో మొదటి వాడైన స్వామి అధినాథ్ (రిషభదేవుడు) కి అంకితం ఈయబడింది.
చిత్రకృప : Bhavyesh Acharya
ఆలయాల సమూహం
శత్రుంజయ కొండ పైభాగంలో జైన ఆలయాల సమూహం ఉంది. దీనిని 11 వ శతాబ్దం నుండి 1900 సంవత్సరంలో జైన తరాలవారు నిర్మించిరి. ఈ దేవాలయాలు "ఆనంద్జీ కళ్యాణ్జీ" సంస్థచే నిర్వహింపబడుతున్నవి.
చిత్రకృప : tommy
పాలరాతి - ప్రార్థనా చిత్రాలు
కొండ దిగువ భాగం నుండి పై భాగానికి పోవుటకు 3800 రాతిమెట్లు బేసి స్థానాలలో అమరి ఎక్కుటకు వీలుగా యున్నవి. దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయి. ఇవి పాలరాతితో కూడి రాతిపై యధార్థ ప్రార్థనా చిత్రాలు కలిగి ఉన్నాయి.
చిత్రకృప : Bernard Gagnon
రిషభదేవుని ఆలయం
ఈ దేవాలయాలలో అతి ముఖ్యమైన దేవాలయం మొదటి తీర్థంకరుడైన రిషభదేవుని ఆలయం. ఇది అలంకృతమైన శిల్పకళా ఆకృతులను కలిగియుంది. ఇతర దేవాలయాలలో కుమార్పాల్, విమల్షా మరియు సంప్రీతి రాజా ముఖ్యమైనవి. కుమారపాల్ సోలంకీ, ఒక గొప్ప జైన్ పోషకుడు, బహుశా అతి ప్రాచీన దేవాలయం నిర్మించారు.
చిత్రకృప : tommy
అద్భుతమైన నగల సేకరణ
ఆలయం ఒక అద్భుతమైన నగల సేకరణ కలిగి ఉంది, మరియు దీనిని ప్రత్యేక అనుమతితో చూడవచ్చు. ఈ దేవాలయాల కాలం 11 వ శతాబ్దం నుండి 20 వ శతాబ్దం మధ్యకాలం.
చిత్రకృప : Bernard Gagnon
నమ్మకం
జైన మత విశ్వాసం గల ప్రతి జైనుడు తన జీవిత కాలంలో ఒకసారైనా ఈ పర్వతం పైకి అధిరోహిస్తాడు. ఎందుకంటే ఈ పర్వతం పై గల దేవాలయాలు పవిత్రమైనవి కనుక. ఈ కొండపై అనేక దేవాలయాలున్నాయి. వీటి జైన సాంప్రదాయం ప్రకారం, వీటి పవిత్రత పర్వతం పైనుండి క్రిందికి ఎక్కువ నుండి తక్కువకు ఉంటుంది.
చిత్రకృప : Bernard Gagnon
పర్వత ప్రయాణం
ఈ పర్వత ప్రయాణం కఠినమైనది. ఈ పర్వతం పై గల రాళ్ళను మెట్లలా తొలిచి వేసిన రహదారి గుండా ప్రయాణించినపుడు గంటన్నర కాలం పడుతుంది. ఈ పర్వతం పైకి ఎక్కుట సాధ్యం కాని వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి స్లింగ్ కుర్చీలు అందుబాటులో గలవు.
చిత్రకృప : Mark Hodson Photos
నియమాలు
అధిరోహకుల కోసం జైన మత సంప్రదాయాల ప్రకారం నియమాలు విధించడం కఠిన తరంగా ఉంది. పర్వతారోహణ సమయమందు ఆహారం తినడం గానీ, తనతో తీసుకొని వెళ్లడం కానీ చేయరాదు.
చిత్రకృప : Bernard Gagnon
ఆంగర్ పీర్
ఈ ఆలయ పవిత్రత సాయంత్ర సమయం లోపుగానే ఎక్కువగా ఉంటుందని విశ్వాసం. రాత్రి సమయంలో ఏ ఆత్మ కూడా ఉండదని నమ్మకం. పైన ఉండగా "ఆంగర్ పీర్" అనే ముస్లిం విగ్రహాన్ని దర్శించవచ్చు. పిల్లలు లేని స్త్రీలు పిల్లల కోసం పీర్ యొక్క దీవెనలు కోరుకుంటారు. వారు పీర్ కు చిన్న ఊయల లను అందించి, వాటిద్వారా చల్లడం ఆచారం.
చిత్రకృప : Bernard Gagnon
రవాణా
వాయుమార్గం
పాలిటానా నుండి 51 కిలోమీటర్ల దూరంలో గల భావ్నగర్ వద్ద ఒక విమానాశ్రయం ఉంది. పాలిటానాకు 215 కి.మీ. దూరంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.
రైలు మార్గం
పాలిటానాలో చిన్న రైల్వే స్టేషను ఉంది. ఇది సొంగథ్ మరియు భావ్నగర్ లను కలిపే రైలు మార్గం. అనేక రైళ్ళు సిహోర్ వద్ద ఆగుతాయి. ఈ స్టేషను అహ్మదాబాద్ మరియు గాంధీనగర్ లను కలిపే మార్గంలో ఉంది.
రోడ్డు మార్గం
భావ్నగర్ నుండి పాలిటానాకు ప్రతి గంటాకూ బస్ సౌకర్యం ఉంది. అహ్మదాబాద్, టాలాజ, యున మరియు డియు ల నుండి రెగ్యులర్ బస్సులు కూడా ఉన్నాయి.
చిత్రకృప : tommy