ఓం నమో వేంకటేశాయ నమః
తిరుమల తిరుపతి,ఆ 7కొండల పేరువింటేనే భక్త జనం ఒళ్ళు పులకరిస్తుంది.భక్తి ఆవహిస్తుంది.
శ్రీ మహావిష్ణువైన వేంకటేశ్వరుడైన ఆదిశేషుని ఏడు పడగలే,ఈ ఏడుకొండలు.
కలియుగంలో స్వామివారికి ఎంత విశిష్టత వుందో ఆయన నివసించిన ఏడుకొండలకి కూడా అంతే ప్రాముఖ్యతవుంది.
పచ్చని లోయలు, జలపాతాలు,అపార ఔషదాలు, కోటితీర్ధాలతో అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే గిరులే ఈ శేషాచల కొండలు.
తిరుమల వెంకన్నకు శేషాచల కొండలంటే చాలా ఇష్టం.
ఈ ఏడు కొండల్లో ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర వుంది.వైకుంటంలో అలిగివచ్చిన లక్ష్మీ దేవిని వెతుక్కుంటూ వచ్చిన వెంకన్న ఏడు కొండలపై కొలువైవున్నాడని స్థలపురాణం చెబుతుంది.
తిరుమల కొండల్లో శ్వేతద్వీపం శేషాచల కొండలనుంచి రహస్య మార్గం
తిరుమల కొండల్లో శ్వేతద్వీపం శేషాచల కొండలనుంచి రహస్య మార్గం
ఎక్కడ వుంది?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు.
తిరుమల కొండల్లో శ్వేతద్వీపం శేషాచల కొండలనుంచి రహస్య మార్గం
తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి.
తిరుమల కొండల్లో శ్వేతద్వీపం శేషాచల కొండలనుంచి రహస్య మార్గం
తిరుమల ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ కోరినకోర్కెలు మొక్కులు తీర్చడంలో దేవదేవుడు శ్రీవేంకటేశ్వరస్వామి సిద్ధ హస్తుడు.
తిరుమల కొండల్లో శ్వేతద్వీపం శేషాచల కొండలనుంచి రహస్య మార్గం
అందుకే ఎన్నిసార్లు తిరుమల వెళ్ళినా, స్వామివారిని దర్శించుకున్నా మరోసారి వెళ్లాలని అనుకోని భక్తులుండరు.
తిరుమల కొండల్లో శ్వేతద్వీపం శేషాచల కొండలనుంచి రహస్య మార్గం
తిరుమలలో కాలుపెడితేనే అనిర్విచనీయమైన శక్తి నడిపిస్తుందనిపిస్తుంది. దేవాలయం మహాద్వారాన్ని దాటగానే శక్తి మనస్సులోకి ప్రవేశించి స్వామిని చేరుస్తుంది.
తిరుమల కొండల్లో శ్వేతద్వీపం శేషాచల కొండలనుంచి రహస్య మార్గం
చూసిన క్షణకాలదర్శనం భక్తులను పరవశులను చేస్తుంది. పునర్దార్శనాన్ని కోరేలాచేస్తుంది.
తిరుమల కొండల్లో శ్వేతద్వీపం శేషాచల కొండలనుంచి రహస్య మార్గం
దేవ దేవుడు అవతరించిన పుణ్యప్రదేశంగా నిత్యం లక్షలాదిభక్తుల కోరికలు తీరుస్తూండే శ్రీ వేంకటేశ్వరునికి రహస్యంగా దేవాదిదేవతలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి వెళుతూంటారని భక్తులు నమ్ముతూవుంటారు. ఇదే విషయాన్ని ఆలయప్రధానార్చకులు రమణ దీక్షితులు కీలకవ్యాఖ్యలు చేసారు.
తిరుమల కొండల్లో శ్వేతద్వీపం శేషాచల కొండలనుంచి రహస్య మార్గం
ఓ టీ వి ఛానల్ తిరుమలపై ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించగా భక్తులకు ఊహకందనివిషయాలను రమణ దీక్షితులు వివరించారు.
తిరుమల కొండల్లో శ్వేతద్వీపం శేషాచల కొండలనుంచి రహస్య మార్గం
తిరుమల కొండలలో శ్వేతదీపం వుందని ఇక్కడ యోగులు, సిద్దులతో పాటు ధవళవస్త్ర ధారులైన దేవతలువుంటారని వారు అక్కడినుంచి స్వామి వారి ఆలయంలోకి ఓ రహస్య మార్గం గుండా వచ్చి పోతుంటారని ఎన్నో పురాణాలలో వుందని చెప్పారు.
తిరుమల కొండల్లో శ్వేతద్వీపం శేషాచల కొండలనుంచి రహస్య మార్గం
ఇంకా పవళింపు సేవతర్వాత సుప్రభాతసేవకు ముందు అసంఖ్యాకంగా దేవతలు స్వామిని సేవించేందుకు వస్తారని సుప్రభాతం తర్వాత స్వామివారి గర్భాలయంలోకి అర్చకులు ప్రవేశించే సమయానికి వారు భుజాలను తాకుతూ దేవతలు బయటకి వెళ్లిపోతారని చెప్పుకొచ్చారు.
తిరుమల కొండల్లో శ్వేతద్వీపం శేషాచల కొండలనుంచి రహస్య మార్గం
అష్టాదశపురాణాల సారమైన వేంకటాచలమహత్యంలో ఈ వివరాలన్నిటిగురించీ చెప్పబడివుందని చెప్పారు.అలాగే శ్వేత దీపాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని స్థలాల్లో రహస్యమార్గాలున్నాయని సిద్ధ పురుషులు,యోగులు,దేవతలు వీటి ద్వారా రాకపోకలు సాగిస్తూ బాహ్యప్రపంచంలోకి వచ్చి లోకకళ్యాణం కోసం కొన్నికార్యాలు చేస్తూవుంటారని చెప్పారు.
తిరుమల కొండల్లో శ్వేతద్వీపం శేషాచల కొండలనుంచి రహస్య మార్గం
ఉత్తరఈశాన్య ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఓ గుహ ముఖం వుందనిఅదే శ్వేత దీపానికి శేషాచలం కొండలనుంచి రహస్య మార్గమని సూచనగా చెప్పబడుతుందని రమణ దీక్షితులు అన్నారు.
తిరుమల కొండల్లో శ్వేతద్వీపం శేషాచల కొండలనుంచి రహస్య మార్గం
ఈ శ్వేత దీపంలో రత్నఖచిత సింహాసనంపై ఓ మహాపురుషుడు ఆసీనుడై వుంది ఇరువైపులా దేవేరులతో కొలువైవుంటారని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.
రోడ్డు మార్గం
తిరుమల బస్టాండు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే బస్సుల కోసం తిరుపతిలో నాలుగు బస్టాండ్లు ఉన్నాయి. మొదటిది రైల్వే స్టేషను ఎదురుగా ఉండే శ్రీ వేంకటేశ్వర బస్స్టేషను.
రోడ్డు మార్గం
రైళ్లు వచ్చే సమయానికి అక్కణ్నుంచి తిరుమలకు వెళ్లే బస్సులు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంటాయి. బెంగుళూరు వైపు నుంచి వచ్చే బస్సులు సరాసరి అలిపిరి టోల్గేటు వద్ద ఉండే బాలాజీ లింక్ బస్స్టేషనుకు వస్తాయి.