'ఇప్పటికీ ఆ గ్రామంలో ఎవరూ నివశించే సాహసం చేయటం లేదు. ప్రస్తుతం మొండి గోడలు, పిచ్చి మొక్కలు తప్ప అక్కడ ఏమీ వుండవు. నేలమట్టమైన సుమారు 600 ఇళ్ళతో భయానకంగా కనిపించే ఆ ప్రాంతం క్రమేణా పర్యాటక స్థలంగా మారింది.
అనగనగా ఒక గ్రామం.అందులో సుమారు 1588 మంది నివశించేవారు. ఒక రోజు ఏమైందో ఏమో కానీ తెల్లారేసరి కల్లా ఊరంతా ఖాళీ అయిపోయింది. నిత్యం సందడిగా కనిపించే ఆ వూరిలో గాలి హోరు తప్ప మరేఅలికిడీ లేదు.
ఇప్పటికీ ఆ గ్రామంలో ఎవరూ నివశించే సాహసం చేయటం లేదు. ప్రస్తుతం మొండి గోడలు, పిచ్చి మొక్కలు తప్ప అక్కడ ఏమీ వుండవు. నేలమట్టమైన సుమారు 600 ఇళ్ళతో భయానకంగా కనిపించే ఆ ప్రాంతం క్రమేణా పర్యాటక స్థలంగా మారింది.
టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి
1. కుల్ధారా
రాజస్థాన్ లోని జైసల్మార్ జిల్లాలో కుల్ధారా అనే గ్రామం వుంది.
PC: youtube
2. స్థానికులు
13 వ శతాబ్దం నుంచీ మనుగడలో వున్న ఈ గ్రామంలో ఇప్పుడు ఆత్మలు సంచరిస్తున్నాయని స్థానికులు చెపుతున్నారు.
PC: Pradeep717
3. సూర్యాస్తమయం
పగటివేళల్లో పర్యాటకుల తాకిడి వున్నా సూర్యాస్తమయం కాగానే నిశ్శబ్దం నెలకొంటుంది.
PC: Suryansh Singh
4. భిన్నకారణాలు
ఈ గ్రామం ఎందుకిలా మారిందనే ప్రశ్నకు స్థానికులు భిన్నకారణాలు చెప్తారు.
PC: youtube
5. సలీం సింగ్
సలీం సింగ్ అనే మంత్రే దీనికంతటికీ కారణమని అతడివల్లే వూరంతా ఖాళీ అయ్యిందని తెలుపుతూవుంటారు.
PC: youtube
6. ఆధీనం
జైసల్మార్ సలీం సింగ్ అనే క్రూరమైన మంత్రి ఆధీనంలో వుండేది.
PC: youtube
7. కుల్దారా
అతడు కుల్దారా గ్రామంలో ఒక బాలికను ఇష్టపడ్డాడు.
PC: youtube
8. స్మశానం
ఎలాగైనా ఆమె తనకు కావాలని లేకుంటే గ్రామాన్ని స్మశానం చేస్తానని పట్టుబట్టాడు.
PC: youtube
9. రాత్రికిరాత్రే ఖాళీ
దీనితో గ్రామస్థులు ఉదయాన్నే ఆమెను తన దగ్గరకు చేరుస్తామని చెప్పి అతన్ని పంపించేసి రాత్రికిరాత్రే ఖాళీ చేసి వెళ్ళిపోయారానే ప్రచారం వుంది.
PC: youtube
10. కరువు
అయితే బ్రిటీష్ వారి కాలంలో ఇక్కడ కరువు ఏర్పడిందని, వ్యవసాయానికి నీళ్ళు లేక ప్రజలు వలసపోయారని మరికొందరు చెప్తారు.
PC: youtube
11. నీటికొలను
అయితే ఈ గ్రామాన్ని ఆనుకునివున్న నీటికొలను ఎప్పుడూ నీటితో నిండి వుంటుంది.
PC: youtube
12. 600 ఇళ్ళు దీనావస్థలో
ఇక్కడ ప్రస్తుతం 600 ఇళ్ళు దీనావస్థలో కనిపిస్తాయి.
PC: youtube
13. అరుపులు
చీకటి పడితే ఏవేవో అరుపులు వినిపిస్తాయని,ఆత్మలు సంచరిస్తాయని స్థానికులు భయంభయంగా చెప్తూవుంటారు.
PC: youtube
14. ఇండియన్ పారానార్మల్ సొసైటీ సభ్యుడు
ఇది ఎంతవరకూ వాస్తవమో తెలుసుకునేందుకు గౌరవ తివార్ అనే ఇండియన్ పారానార్మల్ సొసైటీ సభ్యుడు తన టీంతో కలసి రాత్రి వేళ ఈ గ్రామంలో గడిపి దెయ్యాలు వున్నాయని వెల్లడించాడు.
PC: youtube
15. దెయ్యాల గ్రామం
అప్పటినుంచి దెయ్యాల గ్రామంగా ఈ ప్రాంతానికి మరింత ప్రచారం జరిగింది.
PC: youtube
16. పర్యాటక పరంగా
దెయ్యాలను పక్కన పెడితే పర్యాటక పరంగా ఈ ప్రాంతం తప్పకుండా ఆకట్టుకుంటుంది.
PC: Mohd. Ghanim Khan
17. ఇళ్ళ నిర్మాణ శైలి
అప్పటి ఇళ్ళ నిర్మాణ శైలి చెక్కుచెదరని ఆలయాలు, మొండిగోడల మధ్య ఫోటోలు దిగేందుకు పర్యాటకులు ఇష్టపడతారు.
PC: Suman Wadhwa
18. రాజస్థాన్
మనకీప్రాంతం చూడాలని వుంటే వెంటనే రాజస్థాన్ వెళ్ళాలి.
PC:Suryansh Singh
19. 587 కి.మీ
జైపూర్ నుంచి 587 కి.మీ ల దూరంలో ఈ గ్రామం వుంది.
PC: Pradeep717
20. మిస్టరీ
అయితే ఈ గ్రామంలో ప్రజలందరూ రాత్రికిరాత్రే ఎందుకు ఖాళీ చేశారని అనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
PC: Pradeep717
- నల్లమల కొండ గుహల్లో మీకు తెలియని రహస్యాలు !
- గోదావరి తీరాన ఆదిమానవుల జాడలు !
- గోవా గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు !