ముంబై నగరం పేరు చెప్పగానే ఫ్యాషన్లు, బిజీగా వుండే జీవన విధానం గుర్తుకొస్తాయి. ఆ వెంటనే బాలీవుడ్ సినిమాలు, ప్రసిద్ధ నటీ నటులు కూడా గుర్తుకు వస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రపంచానికి అమెరికా దేశం ఎలా ఉంటుందో, భారత దేశానికి ముంబై అలాగుంటుంది. ముంబై నగర ప్రాధాన్యతలు వివరించాలంటే అక్కడకల వివిధ మతాల ప్రజలు, వివిధ ప్రదేశాలు మరియు అక్కడి ప్రజల మతపర పూజలు మరియు స్ధానికంగా లభించే అనేక రకాల ఆహారాలు మొదలైనవాటిపై ఆధారపడి ఉంటాయి.
మొత్తంగా చెప్పాలంటే, ముంబై నగరంలో అన్ని వయసుల వారికి, అన్ని అభిరుచులవారికి తగినంత ఆనందం లభిస్తూనే ఉంటుంది. మీరు వ్యయం చేసే మొత్తాలను బట్టి మీరు పొందే సేవలు, వస్తువుల నాణ్యత ఉంటుంది. ఎంత తక్కువ సమయం అయినా సరే మీరు నగరాన్ని చూచి ఆనందించవచ్చు. నగరంలో పర్యటించటం చవక మరియు సౌకర్యం ప్రతి ప్రదేశంలోను మీకు మంచి ఆనందం దొరుకుతుంది.
ముంబై
వాతావరణ మార్పులు, సముద్రమట్టాల పెరుగుదల జనావాసానికి పెనుసవాల్ గా మారనుందంటున్నారు పరిశోధకులు.
ముంబై
2100నాటికి ప్రపంచాజనాభాలో 5 వ వంతు అంటే దాదాపు 200కోట్ల మంది వారి ఆవాసాలు సముద్రంపాలు కానున్నాయి.
ముంబై
దీంతో వాళ్ళంతా శరణార్తులుగా మారనున్నారని ప్రపంచవాతావరణ అధ్యయనంలో తేలింది.
ముంబై
అనేక తీరప్రాంతాలు నీటమునుగుతాయని,దీంతో అక్కడ నివసిస్తున్న వారంతా ఎత్తైనప్రాంతాలకు వలసవెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ముంబై
ఇప్పుడే ముంబై,డిల్లీ వంటి నగరాలలో చాలా అతితక్కువ భూభాగంలో ఎక్కువమంది నివసించే రోజులు వున్నాయని ఇంకాతొందరలోనే దాని కన్నా ఇంకా ఇరుకుగా నిసించాల్సివచ్చే అవసరం వుందంటున్నారు.
ముంబై
తీర ప్రాంతాలలోని శరణార్ధులకోసం సముద్రతీరం గల దేశాలు అనుకూలమైన పాలసీలు రూపొందించాల్సిన అవసరం వుందని హెచ్చరిస్తున్నారు.
ముంబై
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2050నాటికి ప్రపంచజనాభా దాదాపు 900లకోట్లకు చేరనుంది.అదే 2100నాటికి దాదాపు 11కోట్లకు చేరుకోనుందని తెలిపారు.
ముంబై
అయితే అంత జనాభాకు ఆహారం అందించాలంటే సారవంతమైన భూమి అవసరం.
ముంబై
సముద్రమట్టాలు పెరిగి సారవంతమైన భూములు,నదీడెల్టా భూములు మునిగిపోనున్న నేపథ్యంలో 2060నాటికి 150కోట్ల మంది ప్రజలు వాతావరణ శరణార్ధులుగా మారనున్నారని,వాతావరణ అధ్యయననివేదిక బయటపెట్టింది.
ముంబై
వాతావరణ మార్పులను అడ్డుకోవాలన్నా,సముద్రమట్టాలు కరగకుండా చూడాలన్నా ఇదొక్కటే మార్గం అన్నారు.
ముంబై
ముంబైలో చూడవలసిన ప్రదేశాలు
కొలబా కాజ్ వే
భారత దేశంలో మొట్టమొదటి ఫ్యాషన్లు ముంబైలో పుడతాయనుకుంటే, వీధి కొనుగోలు ముంబైలో మొట్టమొదట ఎక్కడ మొదలవుతాయంటే కాజ్ వే లో అని చెప్పాలి. ఈ ప్రాంతంలో చాలావరకు వీధులలోనే కొనుగోళ్ళు చేస్తారు. కాజ్ వే అనుభవాలు పొందాలంటే, మీరు కాలినడకన అక్కడ తిరగాలి.
ముంబై
ఎస్సెల్ వరల్డ్ మరియు వాగర్ కింగ్ డం
ఎస్సెల్ వరల్డ్ ఆసియాలోనే అతిపెద్ద ఎమ్యూజిమెంట్ పార్క్. దీనిని డిస్నీ లాండ్ మోడల్ లో నిర్మించారు. ముంబైలోని ఎస్సెల్ వరల్డ్ కు వెళ్ళారంటే ఇక ఆరోజంతా మీకు ఆనందమే. అయితే, ఈ ప్రదేశం సాహస క్రీడలు చేయాలనేవారికి పనికి రాదు. పర్యాటకులు ఈ ప్రదేశం బాగా ఇష్టపడతారు.
ముంబై
గేట్ వే ఆఫ్ ఇండియా
ప్రసిద్ధి గాంచిన శిల్పకళా అద్భుతం గేట్ వే ఆఫ్ ఇండియా దాని 8 అంతస్తుల ఎత్తుతో ముంబై లోని కొలబాలో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీనిని హిందు మరియు ముస్లిం శిల్పశైలులుగా కలిపి నిర్మాణం చేశారు. ఇక్కడకు దక్షిణ ముంబై లో ప్రసిద్ధి గాంచిన రెట్టరెంట్లు బడే మియాస్, కేఫే మండేగర్ మరియు కేఫే లియో పోల్డ్ కూడా సమీపంగానే ఉంటాయి.
ముంబై
హాజీ ఆలీ మసీదు
హాజీ ఆలీ మసీదు ముంబై సముద్ర తీరంలో కలదు. జీవితంలో ఒకేసారి దొరికే అనుభవంగా అన్ని మతాల పర్యాటకులు తమ మతాలు, కులాలు బేధం లేకుండా మరచిపోలేని అందాలు కల హాజీ ఆలీ దర్గా దర్శిస్తారు. శుక్రవారాలు అధిక యాత్రికులు ఇక్కడకు వస్తారు. కనుక తప్పు కాదనుకుంటే శుక్రవారం దీని దర్శనకు వెళ్ళకండి. ఇక్కడే హాజీ అలీ జ్యూస్ సెంటర్ చూడండి.
ముంబై
జుహు బీచ్
బీచ్ ప్రేమికులందరకూ జుహూ బీచ్ ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది. ఇరవై నాల్గు గంటలు ఇక్కడ ఉన్నప్పటికి ఎంతో ఆనందిస్తారు. బంద్రా నుండి 30 నిమిషాల ప్రయాణంతో చేరుకోవచ్చు. బీచ్ లో దొరికే ఆహారాలు ముంబై లోనే ప్రత్యేకత. భేల్ పూరి, పాని పూరి ముంబై శాండ్ విచ్ లు దొరుకుతాయి. గోలాస్ అనే ఐస్ క్రీములు కూడా ఎంతో రుచికరం.