ట్రిచీ లోని ప్రసిద్ధ చర్చిల్లో సెయింట్ జోసెఫ్స్ చర్చి ఒకటి. 1792 లో నిర్మించిన ఈ చర్చి భారత దేశంలోనే పురాతనమైన వాటిలో ఒకటి. బ్రిటిష్ వారి ఆర్ధిక సహాయం తో స్క్వార్ట్జ్ దీన్ని నిర్మించాడు. ఈ చర్చి ద్వారా బ్రిటిష్ వారు క్రైస్తవాన్ని ప్రచారం చేసారు.
నగరం మధ్యన వున్న తెప్పకులం దగ్గర ఈ చర్చి వుంది. ఈ చర్చి మెయిన్ గార్డ్ గేట్ కి దగ్గరలో వుంది.