తుల్జాపూర్ భవాని దేవాలయం బయటి వైపున చింతామణి ఉంది.ఈ దేవాలయం సరైన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయ పడుతున్నదని భక్తులు నమ్మే చింతామణి దేవతకు చెందినది..ఈ దేవాలయ నిర్మాణము గుండ్రటి రాతి ఆకారంలో ఉండి అందమైన చేతితో వేసిన చిత్రాలు కల్గి ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం, పౌర్ణమి రోజులలో ఊరేగింపు కొరకు వాడే ఒక గొప్ప పల్లకి ని కల్గి ఉంటుంది. ఈ శుభప్రదమైన రోజులలో అనేక మంది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు .ఈ దగ్గరలోనే ఖండోబా, మాతంగి, యమైదేవి, నరసింహ మొదలైన దేవతలకు చెందిన చిన్న చిన్న విగ్రహాలను మనం చూడవచ్చు .
పూణే కు దగ్గరగా ఉన్న థియుర్ అనే చిన్న గ్రామంలో చింతామణి దేవాలయం ఉంది. ఎనిమిది అష్టవినాయక దేవాలయాల్లో ఒక్కటైన ఈ పవిత్ర మందిరాన్ని ధరణిధర్ మహారాజ్ దేవ్ నిర్మించాడు.తన చింతలను దూరంచేసుకోవడానికి బ్రహ్మదేవుడు ఇక్కడ తరచుగా గణపతి దేవుని ధ్యానం చేయడం వల్ల ఆయనను చింతామణి గా పిలిచారు.పూర్తిగా నల్లరాతితో అందంగా కట్టిన ఈ దేవాలయం హాలు మధ్యలో ఒక చిన్న ఫౌంటేను ఉంది. ఈ ప్రాంతమంతా కలపతో చేయబడి వేకువ ఝామున చేసే పూజలలో వాడే అగరువత్తులు, కుంకుమల వలన దివ్యమైన సువాసనను కల్గి ఉంటుంది.