మూడు ద్వారములు గల విష్ణు తీర్థము తుల్జా భవాని దేవాలయమునకు ఈశాన్య దిక్కున ఉంది.గంగా యమునా సరస్వతి కలిసే ప్రదేశంగా నమ్మే ఈ ప్రాంతం కల్లోల తీర్థం వంటిదే. రాతి మెట్ల ద్వారా ఇది ప్రధాన మందిరానికి అనుసంధానించబడినది.ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశంనకు భక్తులు ఇక్కడ పవిత్ర స్నానం చేసి తమ పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి వస్తుంటారు.