ఉదయపూర్ లోని జగ్ మందిర్జగ్ మందిర్ గా పిలువబడే లేక్ గార్డెన్ పేలస్ పిచోలా సరస్సు లోని నాలుగిట్లో ఒక ద్వీపం మీద వుంది. మేవార్ వంశానికి చెందిన ముగ్గురు సిసోడియా రాజపుత్రులు ఈ నిర్మాణం చేసారు.1551 లో ముందుగా మహారాణా అమర్ సింగ్ ఈ నిర్మాణం ప్రారంభించారు.
తరువాత, మహారాణ కరణ్ సింగ్ 1620 నుంచి 1628 మధ్య కొంత నిర్మాణం కొనసాగించారు. ఒకటో మహారాణా జగత్ సింగ్ (1628 – 1652) ఈ భావన నిర్మాణం పూర్తీ చేసాడు. చివరి రాజు మహారాణా జగత్ సింగ్ పేరిట ఈ భవనానికి జగ్ మందిర్ అనే పేరు పెట్టారు.జగ్ మందిర్ లోని గుల్ మహల్ ను మొఘల్ యువరాజు ఖుర్రం కోసం నిర్మించారు.
ముస్లిం ల అర్ధచంద్రాకారం కలిగిన ఒక గోపురం ఈ భవనం పైన ఉంది. భవనం లోపల మంటపాలు, అతిధి గృహాలూ, సభా భవనాలూ, నివాస భవనాలూ ఉన్నాయి. జగ్ మందిర్ కి పశ్చిమాన కుమార్ పడాకా మహల్ లేదా యువరాజు మందిరం ఉంది. ఇక్కడి మంటపాన్ని అద్భుతమైన రాతి ఏనుగులతో అలంకరించారు. ఈ ప్రాసాదంలో ఒక పూతోట కూడా ఉంది. ఇక్కడ కాగితం పూలు, మల్లెలు, గులాబులు, దేవగన్నేరు, ఈత చెట్లు పర్యాటకులు చూడవచ్చు.