1572 లో మహారాణా ఉదయ సింగ్ గోల్ మహల్ గా పిలువబడే అందమైన గోపురం ఆకారంలో వుండే రాజ్ అంగన్ ను నిర్మించాడు. రాజు గారు ప్రజల సమస్యలు వినే ప్రదేశంగా దీన్ని పరిగణించేవారు. ఈ భవన నిర్మాణ శైలి తాజ్ మహల్ ను పోలి వుంటుంది. హాల్లో మేవార్ పూర్వపు రాజుల చిత్రాలను యాత్రికులు చూడవచ్చు.
ఈ ప్రాసాదం లో మహారాణా ప్రతాప్ సింగ్ వస్తువులను ప్రదర్శించారు – ఒక భాగాన్ని అతని విశ్వసనీయమైన గుర్రం చేతక్ కు కేటాయించారు.