సహేలియోం కి బరి, ఉదయపూర్ రాణీవాసపు స్త్రీల కోసం 18 వ శతాబ్దంలో మహారాణా సంగ్రామ్ సింగ్ చెలికత్తెల ఉద్యానవనం అనే అర్ధం వచ్చే ‘సహేలియోం కి బారీ’ నిర్మించాడు. స్వయంగా రాజుగారు ఈ అందమైన ఉద్యానవనానికి రూపకల్పన చేసి పెళ్లి అయిన తరువాత 48 మంది చెలికత్తెలు ఉన్న రాణీగారికి దీనిని బహూకరించాడని చెప్తారు.
ఫతే సాగర్ ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం అందమైన ఫౌంటైన్ లు, పచ్చటి పచ్చిక బయళ్ళు, పాలరాతి నిర్మాణాలకు ప్రసిద్ది పొందింది. ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న ఫౌంటైన్ లు ఈ ఉద్యానవనం లో ప్రధాన ఆకర్షణ.
ఇక్కడి ఫౌంటైన్ లు అన్నిటినీ పక్షుల నోటి నించి నీళ్ళు వాడులుతున్నట్లుగా నిర్మించారు. ఈ ఫౌంటైన్ ల చుట్టూ నల్ల రాతితో ప్రాంగణాలు నిర్మించారు. రాచ కుటుంబీకుల వస్తువులను ప్రదర్శించే చిన్న మ్యూజియం కూడా ఈ ఉద్యానవనం లో ఉంది. ఈ మ్యూజియం తో పాటు ఒక గులాబీ తోట, కలువల కొలనులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 దాకా సందర్శకులను అనుమతిస్తారు.